మరో నలుగురు ఐటీబీపీ సిబ్బందికి కరోనా పాజిటివ్..
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భద్రతా బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బందిలో నిత్యం కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
ITBP Personnel Test Positive: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భద్రతా బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బందిలో నిత్యం కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో మరో నలుగురు ఐటీబీపీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఐటీబీపీ లో ఇప్పటివరకు నమోదైన కేసులలో యాక్టివ్ కేసుల సంఖ్య 65కు చేరింది. ఇందులో 18 మంది ఢిల్లీ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నారు. ఐటీబీపీ ఉన్నతాధికారులు ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వారు తెలిపారు.
Also Read: వావ్.. ఎయిర్ ఫోర్స్ కు ఎంపికైన చాయ్ వాలా కూతురు..