AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలయాన్ని అపవిత్రం చేస్తారా.. చితకబాదిన దుండగులు

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలిలో దారుణం చోటుచేసుకుంది. ఆలయ పరిసరాల్లో మాంసాహారం భోజనం చేస్తున్నారని నలుగురిపై దాడి చేశారు దుండగులు. బెల్ట్‌లతో, కర్రలతో వాళ్లను చితకబాదారు. బండబూతులు తిట్టారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు వ్యక్తులు కూర్చొని తింటుండగా ఈ దాడి జరిగింది. దుండగులు అక్కడికి రాగానే దాడి మొదలు పెట్టారు. కాలితో తన్నారు. వదిలేయాలని ప్రాధేయపడినప్పటికి వినలేదు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. […]

ఆలయాన్ని అపవిత్రం చేస్తారా.. చితకబాదిన దుండగులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 02, 2019 | 1:28 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలిలో దారుణం చోటుచేసుకుంది. ఆలయ పరిసరాల్లో మాంసాహారం భోజనం చేస్తున్నారని నలుగురిపై దాడి చేశారు దుండగులు. బెల్ట్‌లతో, కర్రలతో వాళ్లను చితకబాదారు. బండబూతులు తిట్టారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు వ్యక్తులు కూర్చొని తింటుండగా ఈ దాడి జరిగింది. దుండగులు అక్కడికి రాగానే దాడి మొదలు పెట్టారు. కాలితో తన్నారు. వదిలేయాలని ప్రాధేయపడినప్పటికి వినలేదు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఈ దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కొంతమంది వారించినప్పటికి దుండగులు వినలేదు. ఆలయం కంపౌండ్‌లో భోజనం చేసిన్నందుకే ఈ దాడి జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులను గుర్తించామని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.