మద్యం మత్తులో యువకుల వీరంగం.. కానిస్టేబుల్ పై దాడి..!
చెన్నైలోని పాండీబజార్లో మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో తామేం చేస్తున్నారో కూడా తెలియకుండా నడిరోడ్డు పై నానా హంగామా చేశారు. ఏకంగా పోలీసులపై దాడికి పాల్పడ్డారు. జూన్ 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో రోడ్డు పై నలుగురు వ్యక్తులు న్యూసెన్స్ చేస్తుండగా వారిని గమనించిన కానిస్టేబుల్ కార్తికేయన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారు దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. అతని వద్ద ఉన్న వాకీ […]
చెన్నైలోని పాండీబజార్లో మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో తామేం చేస్తున్నారో కూడా తెలియకుండా నడిరోడ్డు పై నానా హంగామా చేశారు. ఏకంగా పోలీసులపై దాడికి పాల్పడ్డారు. జూన్ 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో రోడ్డు పై నలుగురు వ్యక్తులు న్యూసెన్స్ చేస్తుండగా వారిని గమనించిన కానిస్టేబుల్ కార్తికేయన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారు దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. అతని వద్ద ఉన్న వాకీ టాకీని లాక్కుని ధ్వంసం చేశారు. దాడి చేసిన వ్యక్తులు సులేమాన్, మహమ్మద్ రిజ్వాన్, అప్సర్ హుస్సేన్, మహమ్మద్ అలీగా గుర్తించారు. అనంతరం పోలీసులు ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
4 held for attacking police constable at T Nagar in Chennai. pic.twitter.com/KgYj8lC43T
— Mahalingam Ponnusamy (@mahajournalist) June 21, 2019