అన్ని అత్యవసర సేవలకు ఒకే హెల్ప్ లైన్ ‘112’

రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు గాయపడిన వారికి అత్యవసర సేవలు అందించడం కోసం 108కి ఫోన్‌ చేస్తాం. పోలీసులను సంప్రదించడానికి 100, గ్రామీణ వైద్య సేవల కోసం 104 ఇలా ఒక్కో సేవ కోసం ఒక్కో నంబర్‌కు డయల్‌ చేస్తుంటాం. ఈ నంబర్‌లు రాష్ట్రాలను బట్టి మారిపోతుంటాయి. అయితే, ఎలాంటి సహాయం కావాలన్నా ఒకే ఒక్క కాల్‌తో పరిష్కారం లభించేలా కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త హెల్ప్‌లైన్‌ నంబర్‌ 112 ను (పాన్‌-ఇండియా) తీసుకొచ్చింది. ఇప్పటికే […]

అన్ని అత్యవసర సేవలకు ఒకే హెల్ప్ లైన్ '112'
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2019 | 9:50 AM

రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు గాయపడిన వారికి అత్యవసర సేవలు అందించడం కోసం 108కి ఫోన్‌ చేస్తాం. పోలీసులను సంప్రదించడానికి 100, గ్రామీణ వైద్య సేవల కోసం 104 ఇలా ఒక్కో సేవ కోసం ఒక్కో నంబర్‌కు డయల్‌ చేస్తుంటాం. ఈ నంబర్‌లు రాష్ట్రాలను బట్టి మారిపోతుంటాయి. అయితే, ఎలాంటి సహాయం కావాలన్నా ఒకే ఒక్క కాల్‌తో పరిష్కారం లభించేలా కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త హెల్ప్‌లైన్‌ నంబర్‌ 112 ను (పాన్‌-ఇండియా) తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ సేవలను కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పటికీ తాజాగా మరిన్ని రాష్ట్రాలకు విస్తరించారు. దీంతో కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా 20 రాష్ట్రాలు ఈ సేవల పరిధిలోకి వచ్చాయి. నిర్భయ నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి నిధులు చేకూరుస్తోంది.

అన్ని రకాల అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ది ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ (ఈఆర్ఎస్‌ఎస్‌)ను అభివృద్ధి చేశారు. సాయం పొందగోరే వ్యక్తులు తమ ఫోన్‌ నుంచి 112కి డయల్‌ చేస్తే చాలు.. దగ్గర్లోని నెట్‌వర్క్‌ టవర్‌ ఆధారంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)కి అనుసంధానం అవుతుంది. ఒక వేళ స్మార్ట్‌ ఫోన్‌ అయితే జీపీఎస్‌తో మనం ఇచ్చే సమాచారం మరింత ఖచ్చితంగా ఉండటం వల్ల సంబంధిత అధికారులు వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. స్మార్ట్‌ ఫోన్లలో పవర్‌ బటన్‌ను మూడు సార్లు నొక్కడం ద్వారా, కీ-ప్యాడ్‌ మొబైల్స్‌లో 5 లేదా 9ని లాంగ్‌ ప్రెస్‌ చేయడం ద్వారా 112కి కాల్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అంతే కాకుండా ఈఆర్‌ఎస్‌ఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి మనకు కావాల్సిన అత్యవసర సహాయం కోసం మెయిల్‌ కూడా పంపవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్ స్టోర్‌లో ‘112 ఇండియా మొబైల్‌ యాప్‌’ కూడా అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సేవల కోసం నిర్భయ నిధుల నుంచి రూ.321.69 కోట్లను కేటాయించారు. ఇప్పటికే రూ.278.66 కోట్లను విడుదల చేశారు.