భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..!
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామునే మళ్లీ కాల్పుల మోత మోగుతోంది. ఈ దాడులలో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. షోపియాన్ జిల్లాలోని డ్రాగడ్ సుగాన్ ప్రాంతంలో.. భ్రదతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే ఇది గమనించిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామునే మళ్లీ కాల్పుల మోత మోగుతోంది. ఈ దాడులలో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. షోపియాన్ జిల్లాలోని డ్రాగడ్ సుగాన్ ప్రాంతంలో.. భ్రదతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే ఇది గమనించిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగారు.