AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో భారీగా బంగారం పట్టివేత!

తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంపట్టులో 1381 కేజీల బంగారాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా అధికారులు తనిఖీ చేయగా.. బంగారం పట్టుబడింది. దీంతో బంగారం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం టీటీడీది అని నిందితులు చెబుతున్నారు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఈ బంగారం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పీఎన్‌బీలో టీటీడీ బంగారం ఉందని, మెచ్యూరిటీ ముగియడంతో బంగారంను తీసుకెళ్లాలని పీఎన్‌బీ […]

తమిళనాడులో భారీగా బంగారం పట్టివేత!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2019 | 6:43 AM

Share

తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంపట్టులో 1381 కేజీల బంగారాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా అధికారులు తనిఖీ చేయగా.. బంగారం పట్టుబడింది. దీంతో బంగారం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం టీటీడీది అని నిందితులు చెబుతున్నారు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఈ బంగారం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పీఎన్‌బీలో టీటీడీ బంగారం ఉందని, మెచ్యూరిటీ ముగియడంతో బంగారంను తీసుకెళ్లాలని పీఎన్‌బీ అధికారులు టీటీడీకి సూచించారు. అయితే అంతలోనే పీఎన్‌బీ అధికారులు బంగారాన్ని తరలించారు. బంగారం స్వాధీనం చేసుకున్న కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ బోర్డు తేల్చి చెప్పింది. బంగారం తిరుమలలో అప్పగించాల్సిన బాధ్యత పీఎన్‌బీదేనని టీటీడీ స్పష్టం చేసింది.