AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసారి అసభ్య వీడియోలపై కేసు..!

హైదరాబాద్: సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అసభ్య రాతలు రాస్తున్నారని, వీడియోలు పెడుతున్నారని.. దీని వల్ల తన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోందని సినీనటి పూనమ్ కౌర్ మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఇవాళ మరోసారి ఆమె సీసీఎస్ సైబర్ క్రైమ్ కి వెళ్లారు. అక్కడ అడిషనల్ డీసీపీ రఘువీర్ ని కలిసి .. తనపై యూట్యూబ్‌లో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. […]

ఈసారి అసభ్య వీడియోలపై కేసు..!
Ravi Kiran
|

Updated on: Apr 17, 2019 | 9:48 PM

Share

హైదరాబాద్: సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అసభ్య రాతలు రాస్తున్నారని, వీడియోలు పెడుతున్నారని.. దీని వల్ల తన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోందని సినీనటి పూనమ్ కౌర్ మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఇవాళ మరోసారి ఆమె సీసీఎస్ సైబర్ క్రైమ్ కి వెళ్లారు. అక్కడ అడిషనల్ డీసీపీ రఘువీర్ ని కలిసి .. తనపై యూట్యూబ్‌లో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్రెషన్ లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ తో మాట్లాడిన ఫోన్ కాల్ ను రికార్డు చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారని పూనమ్ కౌర్ ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అడిషనల్ డీసీపీ రఘువీర్ తెలిపారు. 36 యూట్యూబ్ ఛానల్స్ పై పూనమ్ ఫిర్యాదు చేసిందని.. కేసు దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.