ఏపీ టెన్త్ రిజల్ట్స్: తూ.గో ఫస్ట్.. నెల్లూరు లాస్ట్..
ఏపీలో పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి ఓవరాల్గా 94.88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా 95.98 శాతంతో అమ్మాయిలే పైచేయి సాధించారు. అబ్బాయిలు 94.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,464 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మూడు స్కూళ్లల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. 98.19 శాతంతో తూర్పుగోదావరి జిల్లా మొదటిస్థానంలో నిలవగా, 83.19 శాతంతో చివరి […]
ఏపీలో పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి ఓవరాల్గా 94.88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా 95.98 శాతంతో అమ్మాయిలే పైచేయి సాధించారు. అబ్బాయిలు 94.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,464 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మూడు స్కూళ్లల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. 98.19 శాతంతో తూర్పుగోదావరి జిల్లా మొదటిస్థానంలో నిలవగా, 83.19 శాతంతో చివరి స్థానంలో నెల్లూరు జిల్లా నిలిచింది.