అరుదైన ఘనత సాధించిన భారత సంతతి ప్రొఫెసర్.. అత్యధిక ఫెలోషిప్ అవార్డ్ అందించిన యూఎస్..
భారత సంతతికి చెందిన అమెరికా ప్రొఫెసర్ ముబారక్ ఉస్సేన్ సయ్యద్ అరుదైన ఘనత సాధించారు. మెదడుపై ఆయన చేస్తున్న
భారత సంతతికి చెందిన అమెరికా ప్రొఫెసర్ ముబారక్ ఉస్సేన్ సయ్యద్ అరుదైన ఘనత సాధించారు. మెదడుపై ఆయన చేస్తున్న ప్రయోగానికి గాను ప్రతిస్ఠాత్మక కెరీర్ ఫెలోషిప్ అవార్డు ఆయనను వరించింది. అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ దీనిని ముబారక్కు ప్రదానం చేసింది. దీతో ఐదు సంవత్సరాల కాలంలో రూ.13 కోట్ల ఫెలోషిప్ ఆయనకు అందనుంది. ఇండియాలోని కశ్మీర్కు చెందిన ముబారక్ ఉస్సేన్ సయ్యద్, అమెరికా న్యూ మెక్సికో యూనివర్సిటీ న్యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కశ్మీర్లోని బుద్గాం జిల్లాకు చెందిన సయ్యద్ అదే ప్రాంతంలో చదుకొని.. ఆ తర్వాత జర్మనీలో తన పీహెచ్డీని పూర్తి చేశారు.
Also Read:
WHO DG: మహమ్మారి నుంచి నేర్చుకున్న పాఠాలు ఏ దేశమైనా మర్చిపోకూడదు.. వంద రోజుల్లో అన్ని దేశాలకు టీకాలు