Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెళ్లి పీటలపై నుంచి వరుడు ప‌రార్‌.. వ‌ధువు చేసిన పనికి అంతా షాక్.! కథలో ఊహించని ట్విస్ట్..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జరిగిన పెళ్ళిలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు, పెళ్ళి కూతురు పెళ్ళి మండపంలోకి వ‌చ్చారు. తాళీ క‌ట్టే స‌మ‌యం...

Viral: పెళ్లి పీటలపై నుంచి వరుడు ప‌రార్‌.. వ‌ధువు చేసిన పనికి అంతా షాక్.! కథలో ఊహించని ట్విస్ట్..
Covid
Follow us
Ravi Kiran

|

Updated on: May 19, 2021 | 9:30 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జరిగిన పెళ్ళిలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు, పెళ్ళి కూతురు పెళ్ళి మండపంలోకి వ‌చ్చారు. తాళీ క‌ట్టే స‌మ‌యం రానే వ‌చ్చింది. కానీ, పెళ్ళి కూతురు మెడ‌లో వ‌రుడికి బ‌దులుగా గెస్టుగా వ‌చ్చిన మ‌రో వ్య‌క్తి తాళి క‌ట్టాడు. సినీ ఫ‌క్కీలో జరిగిన ఈ ఘ‌ట‌నను చూసి బంధుమిత్రులు విస్తుపోయారు. పెళ్ళి కొడుక్కి ఆ పెళ్ళి ఇష్టం లేదు. కానీ త‌ల్లిదండ్రులకి ఆ విష‌యం చెప్ప‌లేక‌పోయాడు.

అందుకే వేదిక పైకి ఎక్కి పీట‌ల‌పై కూర్చున్నాడు. వ‌ధూవ‌రులు దండ‌లు కూడా మార్చుకున్నారు. తీరా తాళి క‌ట్టే స‌మ‌యానికి పెళ్లి కొడుకు మాయ‌మ‌య్యాడు. కాసేపు అత‌ని కోసం వెతికిన ఇరు కుటుంబాలవారు పెళ్ళి ఇష్టం లేక‌నే అత‌ను పారిపోయిన‌ట్లు తెలుసుకున్నారు. వ‌రుడు పారిపోయి వ‌ధువు ఒక్కతే పెళ్ళి పీట‌లపై ఉండ‌టాన్ని వ‌ధువు త‌ర‌పు బంధువులు అవ‌మానంగా భావించారు. అందుకే ఇంత‌దాకా వ‌చ్చిన పెళ్ళిని ఆప‌కూడ‌ద‌నే ఉద్దేశంతో పెళ్ళికి వ‌చ్చిన అతిథుల్లో ఎవ‌రైనా వ‌ధువును చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారా అని ఆరా తీశారు. దాంతో ఓ వ్యక్తి పెళ్ళిచేసుకోవడానికి ఒప్పుకున్నాడు. దాంతో ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని అదే వేదిక‌పై పెళ్ళి జ‌రిపించారు.

Also Read: 

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ టైమింగ్ మారిందా.? ఇందులో నిజమెంత.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!