AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకొని తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు మీకు తెలుసా..?

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో నెయ్యిని కలిపి తాగితే శరీరానికి ఎన్నో అనుకూలమైన మార్పులు వస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా.. బరువు తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుంది.

గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకొని తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు మీకు తెలుసా..?
Ghee Benefits
Prashanthi V
|

Updated on: Apr 11, 2025 | 5:12 PM

Share

ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొద్దిగా నెయ్యి కలిపి తాగడం ద్వారా శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ఒక సాధారణమైన అలవాటు లాగా అనిపించినా దీని ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి కలిపిన వేడి నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయంలో ఉండే ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది. మలబద్ధకంతో బాధపడే వారికి ఇది సహజమైన ఉపశమనం కలిగిస్తుంది. నెయ్యిలో ఉండే సహజ కొవ్వులు పేగుల ఉత్సాహాన్ని పెంచి వేగంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి.

నెయ్యిలో విటమిన్ A, E, D, K వంటి ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించడంలో సహాయపడతాయి. వేడి నీటిలో నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి వేడి, పోషణ ఒకే సమయానికి అందుతుంది.

చాలా మందికి ఎక్కువగా ఎదురయ్యే సమస్యలలో పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం ఒకటి. ఉదయాన్నే నెయ్యి కలిపిన వేడి నీటిని తీసుకోవడం వల్ల మెటబాలిజం వేగంగా పని చేయడం ప్రారంభిస్తుంది. దీని వల్ల శరీరంలోని అతి అవశ్యకమైన కొవ్వులు తక్కువై బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది.

నెయ్యిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు కణాలకు కావలసిన శక్తిని అందిస్తాయి. ఇవి నరాల వ్యవస్థను మెరుగుపరచి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. దీని వల్ల మానసిక అలసట తగ్గి మేధస్సు తేటతెల్లంగా ఉంటుంది.

నెయ్యిలో ఉండే విటమిన్ D శరీరానికి కాల్షియాన్ని చక్కగా శోషించుకునేలా చేస్తుంది. దీని వలన ఎముకలు బలంగా ఉండి అధిక వయస్సులో వచ్చే ఎముకల సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. నిత్యం తగిన మోతాదులో నెయ్యిని వేడి నీటితో తీసుకుంటే ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.

రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి కలిపిన గోరువెచ్చని నీటిని తాగే అలవాటు ఎంతో ఆరోగ్యదాయకమైనది. ఇది జీర్ణక్రియను చక్కబెడుతూ, రోగనిరోధక శక్తిని పెంపొందించి, బరువు నియంత్రణలోనూ, మెదడు ఆరోగ్యానికి, ఎముకల బలానికి సహాయపడుతుంది. ఈ చిన్న మార్పుతో మీరు ఆరోగ్యంగా ఉండే మార్గాన్ని ఏర్పరచుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)