Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Diet: నేరేడు పండ్లు, గింజలు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా.. ఇందులో నిజం ఎంత..?

నేరేడు పండు, బెర్రీలతో పాటు, దాని కెర్నల్స్ తీసుకోవడం కూడా డయాబెటిక్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు, దాని గింజలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

Diabetes Diet: నేరేడు పండ్లు, గింజలు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా.. ఇందులో నిజం ఎంత..?
Black Berry
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 20, 2022 | 2:18 PM

మధుమేహం అనేది దేశంలో, ప్రపంచంలో రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న ఒక వ్యాధి. షుగర్ పేషెంట్ల సంఖ్య వేగంగా పెరుగుతున్న భారతదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని పిలుస్తారు. భారతదేశంలో 75 శాతానికి పైగా రోగుల షుగర్ లెవెల్ అదుపులో లేదని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం లేదంటే గుండె జబ్బులు, కిడ్నీలు, ఊపిరితిత్తులు ప్రమాదానికి గురవుతాయి. నేరేడు పండు తీసుకోవడం మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది. నేరేడు పండు వేసవి ముగింపు వర్షాలు ఆరంభంలో దొరికే పండు. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ పండు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది యాసిడిక్ ఫ్రూట్, ఇది ఆస్ట్రింజెంట్ స్వభావం కలిగి ఉంటుంది.

ఈ పండు రుచిలో తీపిగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేరేడు పండు, బెర్రీలతో పాటు, దాని కెర్నల్స్ తీసుకోవడం కూడా డయాబెటిక్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు, దాని గింజలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

డయాబెటిక్ రోగులకు నేరేడు పండు ఎలా ఉపయోగపడుతుంది: మధుమేహ రోగులకు నేరేడు పండు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యునాని, ఆయుర్వేద విధానాలలో ఈ పండును తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలు నయం అవుతాయి. నేరేడు ఆకులు, గింజలు, బెరడు చాలా ఉపయోగకరమైన భాగాలు, ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

బెరడు, గింజలు, ఆకుల పదార్దాలు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఈ పండును తినే వ్యక్తులు రక్తంలో చక్కెర, గ్లైకోరియా (మూత్రంలో చక్కెర) దీర్ఘకాలిక తగ్గింపును కలిగి ఉన్నట్లు తేలింది. నేరేడు పండులో విటమిన్ ఎ, విటమిన్ సి ఉత్తమ మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

ఇది ఆయుర్వేదంలో గొంతు నొప్పి, ఉబ్బసం చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. చీముతో నిండిన గాయాలను నయం చేయడానికి నేరేడు ఆకులను పురాతన రోజుల్లో ఉపయోగించారు, ఇది యాంటీ బాక్టీరియల్, వైద్యం చేసే లక్షణాలను కూడా కలిగి ఉందని సూచిస్తుంది.

నేరేడు పండు కెర్నలు చక్కెరను ఎలా నియంత్రిస్తాయి: నేరేడు పండు కెర్నల్స్‌లో జంబోలిన్,జాంబోసిన్ కనిపిస్తాయి, ఇవి రక్తం నుండి విడుదలయ్యే రక్తంలో చక్కెర వేగాన్ని తగ్గిస్తాయి. దీన్ని పౌడర్‌గా చేసి తినవచ్చు. గింజల పొడిని తయారు చేయడానికి, వాటిని ఎండలో ఎండబెట్టి, ఆపై వాటిని మెత్తగా నమిలి తినండి. ఇది శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం