కారం తింటే.. కళ్ళు, ముక్కు నుంచి నీరు రావడానికి కారణం ఇదే..
కొందరు మిరపకాయలను తినడానికి ఇష్టపడతారు. ఇది తిన తర్వాత కొందరికి ఒకొక్కసారి కళ్లు, ముక్కులో నీరు రావడం మొదలవుతుంది. కారం అధికంగా తింటే ముక్కు, కళ్లలో నుంచి నీళ్లు రావడం సర్వసాధారణం. అయితే ఎందుకు ఇలా కళ్లు, నీరు నుంచి నీరు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా.? ఈ విషయం గురించి ఈరోజు మనం పూర్తి వివరణతో తెలుసుకుందాం..
Updated on: Dec 10, 2025 | 7:54 PM

కొందరు మిరపకాయలను తినడానికి ఇష్టపడతారు. ఇది తిన తర్వాత కొందరికి ఒకొక్కసారి కళ్లు, ముక్కులో నీరు రావడం మొదలవుతుంది. కారం అధికంగా తింటే ముక్కు, కళ్లలో నుంచి నీళ్లు రావడం సర్వసాధారణం. అయితే ఎందుకు ఇలా కళ్లు, నీరు నుంచి నీరు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా.? ఈ విషయం గురించి ఈరోజు మనం పూర్తి వివరణతో తెలుసుకుందాం..

కారం ఎక్కువైనా సరే.. లేదా మిరపకాయను కోరికిన వెంటనే నోటి నుండి హుస్ అనే శబ్దం చేస్తారు. నోరు మొత్తం మండిపోతుంది. అప్పుడు వెంటనే చేతి నీటి గ్లాసు కోసం వెతుకుతుంది. మరోవైపు ముక్కు, కళ్ళ నుండి నీరు ప్రవహిస్తుంది.

ఇలా కారం తిన్న వెంటనే నోరు మండటానికి కారణం చాలా మందికి తేలింది. మీకు ఈ ప్రశ్న కొన్ని సార్లు వచ్చి ఉంటుంది. ఈ విషయంపై అమెరికన్ కెమికల్ సొసైటీ గతంలో ఒక అధ్యయనం చేసింది. ఇందులో ఆసక్తికార విషయాన్ని వెల్లడించింది.

మిరపకాయలో కెప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. మిరపకాయకు ఇది ఒక రక్షణ కవచం అని తెలుస్తోంది. ఎందుకంటే జంతువులు, మానవులు ఈ రసాయనాల వలన మిర్చి మొక్కను టచ్ చేయలేరు. ఒక రకంగా కెప్సైసిన్ అనే రసాయనం మిర్చిని కాపాడుతుందన్నమాట.

ఈ రసాయన స్వభావంతో నోటికి తగిలిన వెంటనే శరీరంలో మంటను కలిగిస్తుంది. దీని తర్వాత మన శరీరం రక్షణలోకి వెళుతుంది. కెప్సైసిన్ రసాయనం శరీరాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే శరీరంలోని ముక్కు, కళ్ల నుంచి ఆ రసాయనాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. దీని కారణంగా ముక్కు, కళ్ళ నుండి నీరు రావడం ప్రారంభమవుతుంది.




