AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో లీస్ట్.. యాంటీజెన్ టెస్టుల్లో టాప్.. కరోనా గణాంకాల్లో తెలంగాణ పరిస్థితి..

దేశంలో కొవిడ్ టెస్టులు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు అతి తక్కువ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం లెక్కల ప్రకారం..

ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో లీస్ట్.. యాంటీజెన్ టెస్టుల్లో టాప్.. కరోనా గణాంకాల్లో తెలంగాణ పరిస్థితి..
uppula Raju
|

Updated on: Feb 15, 2021 | 4:17 PM

Share

దేశంలో కొవిడ్ టెస్టులు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు అతి తక్కువ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం లెక్కల ప్రకారం.. ఫిబ్రవరి 9 నాటికి రాష్ట్రంలో మొత్తం 10,60,226 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినట్లు వెల్లడించింది. మొత్తం టెస్టుల్లో ఇది కేవలం 15.52 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. కాగా యాంటీజెన్ టెస్టుల్లో దేశంలో అత్యధిక స్థాయిలో నిర్వహించిన ఘనత తెలంగాణకే దక్కింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా 84 శాతం మన దగ్గర రాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేసినట్లు కేంద్రం వివరించింది. కాగా చిన్న చిన్న రాష్ట్రాల్లో సైతం ఆర్టీపీసీఆర్ టెస్టులు భారీగా నిర్వహించారు. దేశంలో 98 శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. అక్కడ రాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయలేదు.

ఇదిలా ఉంటే దేశంలో ఆయా రాష్ట్రాల్లో గతేడాది మే నుంచి జనవరి వరకు నమోదైన కరోనా పాజిటివ్ గణాంకాలను కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ రేట్ జనవరి మాసంలో ఒక శాతానికి పడిపోయినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆగస్టు మాసం నుంచి కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గుతూ వస్తున్నట్లు తెలిపారు. జనవరి మాసంలో కేవలం ఒక శాతమే పాజిటివ్ రేటు ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో తొలి కరోనా కేసు గతాడేది జనవరి 30న నమోదు కాగా, తెలంగాణలో మార్చి 2న నమోదైంది. అనంతరం వైరస్ వ్యాప్తి పెరుగుతూ వచ్చింది. జూన్ నాటికి దేశంతో పాటు తెలంగాణలోనూ కేసులు భారీగా పెరిగాయి. ఆ తర్వాత నాలుగు మాసాల పాటు కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలో జూన్‌లో 36.5 శాతం, జూలైలో 35.2 శాతం పాజిటివ్ రేటు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

India vs England 2nd Test: రెండో ఇన్నింగ్స్‌లో ముగిసిన భారత్ పోరాటం.. 286 పరుగులకు ఆలౌట్.. ఇంగ్లాండ్ టార్గెట్ 482 పరుగులు..