AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మజిలీ’ ఎఫెక్ట్.. పారితోషికం పెంచేసిన చైతూ!

‘మజిలీ’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్‌బస్టర్ అవడంతో.. అందరి దర్శకుల దృష్టి ఇప్పుడు అక్కినేని నాగచైతన్యపై పడింది. దీనితో అక్కినేని వారసుడు అమాంతం తన రెమ్యునరేషన్‌ను పెంచేశాడని తెలుస్తోంది. ‘మజిలీ’ సినిమాతో చైతన్య బాక్స్ ఆఫీస్ రేంజ్ పెరిగింది. అంతకముందు చైతన్య సినిమాలు 20 కోట్ల రేంజ్‌లో ఆడేవి. పాతిక కోట్లకి మించి బిజినెస్ ఉండేది కాదు. కానీ మజిలీ సినిమా థియేటర్ల నుంచి 38 కోట్లు పొందింది. ఇతరత్రా మరో 10 కోట్ల […]

'మజిలీ' ఎఫెక్ట్.. పారితోషికం పెంచేసిన చైతూ!
Ravi Kiran
|

Updated on: Jun 21, 2019 | 9:33 PM

Share

‘మజిలీ’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్‌బస్టర్ అవడంతో.. అందరి దర్శకుల దృష్టి ఇప్పుడు అక్కినేని నాగచైతన్యపై పడింది. దీనితో అక్కినేని వారసుడు అమాంతం తన రెమ్యునరేషన్‌ను పెంచేశాడని తెలుస్తోంది. ‘మజిలీ’ సినిమాతో చైతన్య బాక్స్ ఆఫీస్ రేంజ్ పెరిగింది. అంతకముందు చైతన్య సినిమాలు 20 కోట్ల రేంజ్‌లో ఆడేవి. పాతిక కోట్లకి మించి బిజినెస్ ఉండేది కాదు. కానీ మజిలీ సినిమా థియేటర్ల నుంచి 38 కోట్లు పొందింది. ఇతరత్రా మరో 10 కోట్ల రెవెన్యూ నిర్మాతకు ప్రాఫిట్‌గా వచ్చింది.

‘మజిలీ’ అంత పెద్ద హిట్టయ్యేసరికి ఏకంగా ఇంతకుముందు తీసుకుంటున్న పారితోషికానికి అదనంగా మూడు కోట్లు అడుగుతున్నాడట నాగచైతన్య. తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో కొత్త సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమాకి ఇలా అధికంగా పారితోషికం అడిగాడట. దానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పారని సమాచారం.

నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఇప్పటికే 10 కోట్ల రేంజ్‌లో పారితోషికం తీసుకుంటున్నారు. చైతన్య నెక్స్ట్ టార్గెట్ ఇదే. ప్రస్తుతం ఆయన బిలో 10లో ఉన్నాడు. ఐతే చైతన్య ఆ రేంజ్‌కి వెళ్లాలంటే మరో రెండు భారీ హిట్స్ ఇవ్వాలి. ఓవర్సీస్ మార్కెట్‌ని పెంచుకోవాలి. ఆ టార్గెట్‌తోనే చైతన్య ఇప్పుడు సినిమాలు ఒప్పుకుంటున్నాడని తెలుస్తోంది.