అక్కే నన్ను చంపాలనుకుంది: సాక్షి శివానంద్‌పై సోదరి ఫిర్యాదు

| Edited By:

Jul 24, 2019 | 1:50 PM

తన సోదరి సాక్షి శివానంద్ తనను చంపాలనుకుంటోందని ప్రముఖ నటి శిల్పా ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేశారు. అత్తింటి వారితో కలిసి ఆమె తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆమె అన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన శిల్పా.. సాక్షి శివానంద్, ఆమె అత్తింటి వారిపై షాకింగ్ విషయాలను బయటపెట్టింది. కొన్ని నెలల క్రితం నా సోదరి సాక్షి, ఆమె అత్త భావనలపై మా అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భావన తన భర్తను చంపేసింది. […]

అక్కే నన్ను చంపాలనుకుంది: సాక్షి శివానంద్‌పై సోదరి ఫిర్యాదు
Follow us on

తన సోదరి సాక్షి శివానంద్ తనను చంపాలనుకుంటోందని ప్రముఖ నటి శిల్పా ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేశారు. అత్తింటి వారితో కలిసి ఆమె తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆమె అన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన శిల్పా.. సాక్షి శివానంద్, ఆమె అత్తింటి వారిపై షాకింగ్ విషయాలను బయటపెట్టింది.

కొన్ని నెలల క్రితం నా సోదరి సాక్షి, ఆమె అత్త భావనలపై మా అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భావన తన భర్తను చంపేసింది. ఇప్పుడు బీమా డబ్బుల కోసం నన్ను, నా తల్లిని కూడా చంపాలనుకుంటోంది. దీనికి నా సోదరి సాక్షి శివానంద్ సాయం చేస్తోంది. పోలీసులు ఎక్కుడ పట్టుకుంటారోనని భావన అమెరికాకు పారిపోయింది. ఆమె ఎప్పుడొస్తే అప్పుడు అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. మరో నా స్నేహితురాలు నాపై అత్యాచారం చేసేందుకు ఒకరిని పురమాయించింది. సొంత అక్క ఇంటి నుంచి గెంటేసింది. ఈ విషయంలో నా అభిమానులు, నాకు తెలిసిన వారు సాయం చేస్తానని కోరుతున్నా అని పోస్ట్ చేశారు శిల్ప.

అయితే తెలుగులో మాస్టర్, కలెక్టర్ గారు, స్నేహితులు, ఇద్దరు మిత్రులు, సముద్రం, యువరాజు, సింహరాశి వంటి చిత్రాల్లో సాక్షి శివానంద్ నటించగా.. శిల్పా ఆనంద్, మంచు విష్ణు నటించిన విష్ణులో కనిపించిన విషయం తెలిసిందే.