Anil Ravipudi: దృశ్యం2 సినిమాను వీక్షించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నారంటే..

విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటించిన తాజా చిత్రం 'దృశ్యం2'. మలయాళ డైరెక్టర జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి,

Anil Ravipudi: దృశ్యం2 సినిమాను వీక్షించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నారంటే..
Follow us

|

Updated on: Nov 29, 2021 | 2:21 PM

విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటించిన తాజా చిత్రం ‘దృశ్యం2’. మలయాళ డైరెక్టర జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ థ్రిల్లర్ ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 25న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. తాజాగా స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఈ సినిమాను వీక్షించారు. అనంతరం సినిమా గురించి తన అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

‘ ఆద్యంతం ట్విస్టులు, మలుపులతో ‘దృశ్యం 2’ సినిమా అద్భుతంగా అనిపించింది. రాంబాబుగా మన వెంకటేశ్ గారు మైండ్ గేమ్ తోఅదరగొట్టారు. ‘దృశ్యం 2 చిత్రాన్ని అసలు మిస్ అవకండి’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కాగా అనిల్‌ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్‌, వరుణ్లతో ‘ఎఫ్‌3’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో వాయిదా పడుతూ వస్తోంది. రాబోయే వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం పేర్కొంది.

Also Read:

Dhanush: బ్రిక్స్‌ పురస్కారం అందుకున్న తమిళ స్టార్‌ ధనుష్‌.. ఎందుకంటే..

Samantha : ఆహా అవార్డు అందుకోనున్న అందాల సమంత.. అసలు విషయం ఏంటంటే..

Mehreen Pirzada : సీనియర్ హీరోతో రోమన్స్ కు సై అన్న హనీ.. నాగ్ సినిమాలో మెహరీన్..