AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Movie Tickets: ప్రతి రామాలయానికి ఆదిపురుష్ 100 టిక్కెట్లు ఉచితం.. తెలంగాణలోని ఆ జిల్లాకు మాత్రమే

రణ్‌బీర్‌ కపూర్‌ లాంటి స్టార్‌ హీరోలు పిల్లలందరూ ప్రభాస్‌ సినిమాను చూడాలని 10వేలకు పైగా టికెట్లను ముందుగా బుక్‌ చేయనున్నారు. ఇప్పుడీ మంచి కార్యంలో శ్రేయాస్‌ మీడియా కూడా పాలుపంచుకోనుంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(101) టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్‌ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్‌ రావు తెలిపారు.

Adipurush Movie Tickets: ప్రతి రామాలయానికి ఆదిపురుష్ 100 టిక్కెట్లు ఉచితం.. తెలంగాణలోని ఆ జిల్లాకు మాత్రమే
Adipurush Movie
Basha Shek
|

Updated on: Jun 12, 2023 | 7:07 AM

Share

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం ఆదిపురుష్‌. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ పౌరాణికచిత్రంలో కృతీసనన్‌ సీతమ్మగా నటించింది. భూషణ్‌ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్‌ రౌత్, ప్రసాద్‌ సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌ సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మైథలాజికల్‌ మూవీ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ ఎత్తున ప్రభాస్‌ రిలీజ్‌ చేస్తోంది. కాగా రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు విచ్చేస్తాడన్న నమ్మకంతో ఆది పురుష్‌ ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును ఖాళీగా ఉంచనున్నారు. అలాగే రణ్‌బీర్‌ కపూర్‌ లాంటి స్టార్‌ హీరోలు పిల్లలందరూ ప్రభాస్‌ సినిమాను చూడాలని 10వేలకు పైగా టికెట్లను ముందుగా బుక్‌ చేయనున్నారు. ఇప్పుడీ మంచి కార్యంలో శ్రేయాస్‌ మీడియా కూడా పాలుపంచుకోనుంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(101 ) ఆది పురుష్ టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్‌ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్‌ రావు తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని సోషల్‌ మీడియా వేదికగా కోరారు.

‘శ్రీరాముడు, సీతమాత గాథ అందరికీ ఆదర్శం. ఆ దివ్యమైన చరిత్రే ఆదిపురుష్‌ సినిమా. ఆ ఆదర్శవంతమైన దివ్య మంగళ చరిత్ర ప్రతి ఒక్కరికి చేరాలనే సంకల్పంతో ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రతి రామాలయానికి 100 టిక్కెట్లు ఇవ్వదల్చుకున్నాం. టికెట్లు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు’ అని శ్రేయాస్‌ మీడియా ట్వీట్‌ చేసింది. ఆది పురుష్‌ సినిమాలో బాలీవుడ్‌ విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్ , ట్రైలర్స్ సినిమా పై అంచనాలను అమాంత పెంచేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..