AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Nagma: చెబితే వినాలని చెప్పేది ఇందుకే.. ఒకే ఒక్క క్లిక్ చేసి రూ. లక్ష పోగొట్టుకున్న హీరోయిన్ నగ్మా.

సైబర్ మోసగాళ్ల ద్వారా డబ్బు పోగొట్టుకున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులు పంపిన మెసేజ్ మాదిరిగానే తనకు ఎస్ఎంఎస్ వచ్చిందని.. దానిపై క్లిక్ చేయగానే ఓ వ్యక్తి కాల్ చేశారని అన్నారు నగ్మా.

Actress Nagma: చెబితే వినాలని చెప్పేది ఇందుకే.. ఒకే ఒక్క క్లిక్ చేసి రూ. లక్ష పోగొట్టుకున్న హీరోయిన్ నగ్మా.
Nagma
Rajitha Chanti
|

Updated on: Mar 09, 2023 | 12:25 PM

Share

తెలుగుతోపాటు.. హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు సీనియర్ హీరోయిన్ నగ్మా. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా నగ్మా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని పెద్ద మొత్తంలో మోసపోయారు. తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ పై క్లిక్ చేసి రూ. లక్ష పోగొట్టుకున్నారు. సైబర్ మోసగాళ్ల ద్వారా డబ్బు పోగొట్టుకున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులు పంపిన మెసేజ్ మాదిరిగానే తనకు ఎస్ఎంఎస్ వచ్చిందని.. దానిపై క్లిక్ చేయగానే ఓ వ్యక్తి కాల్ చేశారని అన్నారు నగ్మా.

ఫిబ్రవరి 28న తన ఫోన్ కు బ్యాంకు అధికారులు పంపినట్లుగానే ఓ మెసేజ్ వచ్చిందని.. దానిపై క్లిక్ చేయగానే… తనకు ఓ వ్యక్తి కాల్ చేశారని అన్నారు నగ్మా. బ్యాంకు ఉద్యోగిగా తనను తాను పరిచయం చేసుకున్నాడని.. కేవైసీ అప్డేట్ చేయాలని కోరాడని.. ఆమె తన బ్యాంకు వివరాలు తెలియజేయనప్పటికీ తన ఆన్ లైన్ బ్యాంకులోకి లాగిన్ అయ్యి… బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాదాపు రూ. లక్ష ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడని వాపోయింది.

ఇవి కూడా చదవండి

అతను తన బ్యాంకు ఖాతాకు లాగిన్ అయ్యే క్రమంలో తన ఫోన్ కు దాదాపు 20సార్లు ఓటీపీలు వచ్చాయని.. కానీ ఆ ఓటీపీ.. బ్యాంకు వివరాలు అతడికి చెప్పలేదని తెలిపారు. పెద్ద అమౌంట్ కాకుండా కేవలం లక్ష రూపాయాలతో ఈ ఫ్రాడ్ నుంచి బయటపడినందుకు నగ్మా బాధలోనూ సంతోషం వ్యక్తం చేసారు. నగ్మాలాగే మరో 80 మంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.