ఇద్దరు టాలీవుడ్ భామలతో సల్మాన్ రొమాన్స్.. రష్మికాతో పాటు ఆమె కూడా..
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సల్లూకు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఇప్పుడు మరో బ్యూటీ కూడా సల్మాన్ ఖాన్ తో రోమన్ చేయనుందని తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ సినిమాలకు బాలీవుడ్ లోనే కాను టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో సల్మాన్ సినిమా కూడా ఇప్పుడు అదే బాటలో రానుంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సల్లూకు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఇప్పుడు మరో బ్యూటీ కూడా సల్మాన్ ఖాన్ తో రోమన్ చేయనుందని తెలుస్తోంది. రష్మికతో పాటు మరో టాలీవుడ్ బ్యూటీ కూడా ఇప్పుడు సల్మాన్ సినిమాలో నటిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి : రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న భామ.. ఎవరో తెలుసా.?
ఏఆర్ మురుగదాస్ ‘శిఖందర్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది హిందీ సినిమా అయినప్పటికీ మురుగదాస్ దక్షిణాది ఆర్టిస్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో హీరోయిన్గా రష్మికను మెయిన్ హీరోయిన్ గా సెలక్ట్ చేశారు.. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా రష్మికతో కలిసి ఈ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. సినిమా సెట్లో పూల బొకేతో స్వాగతం పలికింది మూవీ టీవీ. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి :Sai Pallavi: ఇదికదా ఫ్యాన్స్కు కావాల్సింది..! ముచ్చటగా మూడోసారి ఆ హీరోతో సాయి పల్లవి..
కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఆ ఫోటో షేర్ చేసింది. ఇందులో ‘సికిందర్’ సినిమా సెట్లో కాజల్ పేరుతో ఐకార్డ్ మనం చూడొచ్చు. ‘సిఖందర్ తొలి రోజు’ అని క్యాప్షన్ ఇచ్చింది కాజల్. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్లో రష్మిక మందన్న చేరింది. సల్లూ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీరి కెమిస్ట్రీని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం 2025 ఈద్కు విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.