AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: యురోప్‌లో జరిగిన యదార్థగాథతో రాధేశ్యామ్ సినిమా.. స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్

Radhe Shyam: ఈశ్వర్ సినిమాతో వెండి తెరపై రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రభాస్ .. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం..

Radhe Shyam: యురోప్‌లో జరిగిన యదార్థగాథతో రాధేశ్యామ్ సినిమా.. స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్
Radhe Shyam
Surya Kala
|

Updated on: Jul 28, 2021 | 5:44 PM

Share

Radhe Shyam: ఈశ్వర్ సినిమాతో వెండి తెరపై రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రభాస్ .. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. దేశ విదేశాల్లో ప్రభాస్ కు ఓ రేంజ్ లో ప్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.. ఈ నేపథ్యంలో బాహుబలి అనంతరం ప్రభాస్ తన మార్కెట్ ను మరింత విస్తరిస్తూ.. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి తర్వాత సాహో సినిమా నిరాశ పరచగా.. తాజాగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టి.. వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు.. వీటిల్లో ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ కాంబినేషన్ తెరకెక్కుతున్న రాధే శ్యామ్ ముందుగా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఒక రియల్ స్టోరీ నుంచి తీసుకున్నారనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది.

కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అయ్యింది.. తాజాగా రాధేశ్యామ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ప్రేమ‌క‌థ అని తెలుస్తోంది. ఈ విష‌యం గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. కొన్నేళ్ల క్రితం యూర‌ప్‌లో ఓ ట్రెయిన్ మిస్ అయ్యింది.. దాని గురించి అధికారులు వెతికినా జాడ క‌నిపెట్ట‌లేక‌పోయారు. చాలా ఏళ్ల త‌ర్వాత ఆ ట్రెయిన్ మ‌ళ్లీ మెక్సికోలో ప్ర‌త్య‌క్ష‌మైంది. అస‌లు ఆ ట్రెయిన్ మెక్సికోకు ఎలా వెళ్లింద‌నేది ఇప్పటికీ ఎవ‌రికీ అంతుబట్టని మిస్టరీనే.. ఈ రియల్ సంఘటన ఆధారంగా దర్శకుడు రాధాకృష్ణ రాధేశ్యామ్ ను తెరకెక్కిస్తున్నడని అంటున్నారు.

రాధేశ్యామ్ లో కూడా ప్రభాస్, పూజాహెడ్గే లు ప్రయాణిస్తున్న రైలు ఓ గుహలోకి వెళ్లి మాయమైపోయి.. వారిని 1979 బ్యాక్ డ్రాప్ లోకి తీసుకుని వెళ్తుందట.. అంటే ఆదిత్య 369 లో టైం మిషన్ ఎక్కగానే విజయనగర సామ్రాజ్యానికి వెళ్లినట్లు .. రాధే శ్యామ్ కూడా గుహలోకి వెళ్ళగానే 1979 లోకి వెళ్తారన్నమాట .. ఆ సమయంలో వీరి మధ్య పుట్టే ప్రేమ .. తో రాధ్య శ్యామ్ పీరియాడిక‌ల్ స్టైల్లో ఉంటుంద‌ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఎంతవరకూ నిజమో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాలసిందే.. లేదా చిత్ర యూనిట్ ప్రకటించాల్సిందే.. ప్రభాస్ సరసన పూజాహెడ్గే హీరోయిన్ గా నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది.

Also Read:  పోలీసుల తనిఖీలు.. అక్రమంగా తరలిస్తున్న 22 కేజీల వెండి వస్తువులు స్వాధీనం..