Prabhas: కృష్ణంరాజు మరణం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభాస్.. ఏకంగా 70 వేల మందికి..

ఇక ఇప్పుడు కృష్ణంరాజు సొంత గ్రామం మొగల్తూరులో నిర్వహించే స్మారక సభకు డార్లింగ్ హజరు కానున్నారు. సెప్టెంబర్ 29న జరిగే ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Prabhas: కృష్ణంరాజు మరణం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభాస్.. ఏకంగా 70 వేల మందికి..
Prabhas Krishnam Raju
Follow us

|

Updated on: Sep 19, 2022 | 7:11 PM

రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణాన్ని అటు ప్రభాస్ (Prabhas) కుటుంబసభ్యులు.. ఇటు ఫ్యాన్స్ ఇంకా  జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ఓవైపు పెదనాన్న మృతితో బాధలో ఉన్న ప్రభాస్.. ఆ సమయంలోనూ ఫ్యాన్స్ గురించి ఆలోచించారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు వచ్చిన అభిమానులకు భోజన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్లండి అంటూ స్వయంగా చెప్పుకొచ్చారట. ఇక ఇప్పుడు కృష్ణంరాజు సొంత గ్రామం మొగల్తూరులో నిర్వహించే స్మారక సభకు డార్లింగ్ హజరు కానున్నారు. సెప్టెంబర్ 29న జరిగే ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రభాస్ తన సొంత గ్రామానికి వెళ్తున్నాడు. అంతేకాకుండా.. కృష్ణంరాజు స్మారక సభ కోసం 70 వేలర మందికి భోజన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాడట. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వాస్తవానికి కృష్ణంరాజు.. ప్రభాస్ కుటుంబాలు ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టాలనే చూస్తుంటారన్న సంగతి తెలిసిందే. డార్లింగ్ తన సినిమా షూటింగ్ సెట్‏లో అందరికీ ఇంటి వద్దే భోజనం రెడీ చేయించి తీసుకెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక వంటకాలను ఉత్తారాదీ నటీనటులకు రుచి చూపించారు ప్రభాస్. సెట్ లో ప్రభాస్ తీసుకువచ్చే భోజనం గురించి ఇప్పటికే చాలామంది సినీతారలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.