AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్‏ను చూసేందుకు పోటెత్తిన అభిమానగణం.. ఫ్యాన్స్‏తో ముచ్చటించిన డార్లింగ్..

దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రభాస్ సొంత గ్రామానికి విచ్చేశారు. తన పెదనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం కుటుంబసభ్యులతోపాటు ప్రభాస్ రావడంతో.. డార్లింగ్‏ను చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు.

Prabhas: ప్రభాస్‏ను చూసేందుకు పోటెత్తిన అభిమానగణం.. ఫ్యాన్స్‏తో ముచ్చటించిన డార్లింగ్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Sep 29, 2022 | 3:48 PM

Share

దివంగత హీరో కృష్మం రాజు సంస్కరణ సభను ఆయన సొంత గ్రామం మొగల్తూరులో సంస్కరణ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తన పెదనాన్న కోసం దాదాపు పన్నెండేళ్ల తర్వాత స్వగ్రామానికి ప్రభాస్ తన కుటుంబసభ్యులతో కలిసి రావడంతో పోలీసు బందోబస్తుతో ఏర్పాట్లు చేశారు. దశాబ్దకాలం తర్వాత తమ అభిమాన హీరో రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నాడు. రెబల్ స్టార్.. డార్లింగ్.. అంటూ నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో వారిని ఉద్దేశించి మాట్లాడారు. వారికి హాయ్ చెబుతూ.. ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చారు. అనంతరం.. ప్రభాస్ మాట్లాడుతూ.. “అందరు ఎలా ఉన్నారు?.. లవ్ యూ డార్లింగ్.. లవ్ యూ ఆల్ టు ది కోర్. అందరూ భోజనం చేయండి” అంటూ చెప్పుకొచ్చారు.

సెప్టెంబర్ 11న సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్మం రాజు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన… హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు మొయినాబాద్‎లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో నిర్వహించగా.. దశదిన కర్మ హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నిర్వహించారు. ఇక కృష్ణంరాజు సంస్మరణ సభకు ముందుగా 70 వేల మంది అభిమానులు వస్తారని అంచనా వేయగా.. దాదాపు లక్ష మందికి పైగా ఫ్యాన్స్ రావడంతో.. భారీ కేడ్లతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

మరోవైపు ప్రభాస్ అభిమానులు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 2010లో తన తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన సమయంలో సంతాప కార్యక్రమాల కోసం ప్రభాస్ మొగల్తూరులో వారం రోజుల పాటు ఉన్నారు. ఇక ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తన పెదనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం వచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.