Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ రాజాసాబ్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కొన్ని నెలలుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. వరుస సినిమాలతో ప్రభాస్ దూసుకుపోతున్నారు. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో హిట్ అందుకున్నారు ప్రభాస్. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్. త్వరలోనే ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫిసర్ గా కనిపించనున్నారు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 లోనూ నటిస్తున్నారు ప్రభాస్.
సలార్ 2, కల్కి 2 సినిమాలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. అయితే ప్రభాస్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోలో ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్ గురించి మాట్లాడారు.
నాకు ఫస్ట్ టైమ్ కళ్లల్లో నీళ్లు.. ఈశ్వర్ సినిమా పూజా కార్యక్రమం అప్పుడు నేను ఓ డైలాగ్ చెప్పా.. “ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు.. ఈ ఈశ్వర్ కు మూడు గుండెలు” అని డైలాగ్ చెప్పా.. అది ఎలా చెప్పానో నాకు తెలియదు ఆ టెన్షన్ లో చెప్పేశా.. అప్పుడు మా నాన్న నా చెయ్యి పట్టుకొని యస్ అన్నారు ఒక్కసారే.. ” అని ప్రభాస్ తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.