AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారితోష‌కం పెంచేసిన ‘బుట్ట బొమ్మ‌’ : ఈ ప‌రుగు ఎందాక‌మ్మా

పూజా హెగ్దే..ఇప్పుడు టాలీవుడ్ లో వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతుంది. స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు ద‌క్కించుకుపోతూ దుమ్మురేపుతుంది.

పారితోష‌కం పెంచేసిన 'బుట్ట బొమ్మ‌' : ఈ ప‌రుగు ఎందాక‌మ్మా
Ram Naramaneni
|

Updated on: Jul 29, 2020 | 4:45 PM

Share

Pooja Hegde Hikes Her Remuneration : పూజా హెగ్దే..ఇప్పుడు టాలీవుడ్ లో వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతుంది. స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు ద‌క్కించుకుపోతూ దుమ్మురేపుతుంది. ‘అల వైకుంఠపురములో’తో ఈ ఏడాది సాలిడ్ హిట్ అందుకుంది బుట్ట‌బొమ్మ‌. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో షూటింగులు ఆగిపోవ‌డంతో ప్ర‌స్తుతం ఇంటి వ‌ద్దే ఉంటుంది పూజా. ప్ర‌స్తుతం, ఆమె ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమాల‌లో న‌టిస్తోంది. వరుసగా స్టార్ హీరోల ప‌క్క‌న అవ‌కాశాలు దక్కించుకున్న పూజా రెమ్యూన‌రేష‌న్ అమాంతం పెంచేంసింద‌ట‌. ‘అల వైకుంఠపురములో’కు పూజా హెగ్డే 1.4 కోట్లు తీసుకుందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల సమాచారం. ఇప్పుడు ఆమె తన పారితోషికాన్ని రెండు కోట్లకు ఫిక్స్ చేసింద‌ట‌. ఇప్పటి వరకు పూజ తీసుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సినిమా ‘సాక్ష్యం’ కోసం భారీ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంద‌ని టాక్. ఆ సినిమాకు సుమారు రూ.కోటిన్నర ఇచ్చారని అప్పట్లో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ వరకు ఆమె ఓకే చెప్పిన‌ సినిమాలకు రూ.కోటి పైగానే చార్జ్ చేసింద‌ట‌.

కాగా ఇప్పుడు ఎవ‌రైనా క‌థ చెప్ప‌డానికి వెళ్తే..పూజా రెండు కోట్ల‌కు త‌గ్గే ప్రసక్తి లేద‌ని చెబుతుంద‌ట‌. క‌రోనా స‌మయంలో కూడా ఇంత ఎందుక‌మ్మా అంటే.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెబుతుంద‌ట‌.

Read More : ఆస్తి పన్ను బకాయిదారులకు తెలంగాణ స‌ర్కార్ బంపర్ ఆఫర్..