Pawan Kalyan: మార్క్ శంకర్తో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు పవన్
అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకున్నాడు. చిన్న కుమారుడు మార్క్ శంకర్తో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు పవన్ దంపతులు. ఈనెల 8న సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే.

Pawan Kalyan
అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకున్నాడు. చిన్న కుమారుడు మార్క్ శంకర్తో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు పవన్ దంపతులు. ఈనెల 8న సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. మార్క్ శంకర్ను చూసేందుకు ఈనెల 9న హుటాహుటిన సింగపూర్ వెళ్లారు పవన్కల్యాణ్. ఇప్పుడు మార్క్ శంకర్ కోలుకోవడంతో.. కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చారు పవన్. సింగపూర్ ఆస్పత్రిలో మార్క్ శంకర్కి నాలుగు రోజులపాటు చికిత్స జరిగింది. గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ చేశారు వైద్యులు.