లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై తొలగిపోయిన సస్పెన్స్

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలపై సస్పెన్స్ తొలగిపోయింది ఈ నెల 29వ తేదీన మూవీ రిలీజ్ అవుతుందని చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నుంచి నోటీసులు రావడంతో, చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి ఇవాళ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిని కలిశారు. ఈసీ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చామని, తాము ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో సీఎం చంద్రబాబు […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై తొలగిపోయిన సస్పెన్స్
Follow us

|

Updated on: Mar 25, 2019 | 6:52 PM

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలపై సస్పెన్స్ తొలగిపోయింది ఈ నెల 29వ తేదీన మూవీ రిలీజ్ అవుతుందని చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నుంచి నోటీసులు రావడంతో, చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి ఇవాళ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిని కలిశారు. ఈసీ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చామని, తాము ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో సీఎం చంద్రబాబు పాత్రను విలన్‌గా చూపించారనే విమర్శలు ఉన్నాయి. అందుకే టీడీపీ నాయకులు ఈ సినిమాపై మండిపడుతున్నారు. విడుదలను అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించారు. కానీ అనుకూల ఫలితం రాలేదు. హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మూవీలో అన్నీ వాస్తవాలేనని వర్మ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పటిదాకా విడుదలైన ట్రైలర్లు, టీజర్లు సాంగ్స్ చూస్తే సినిమాలో ఏ రేంజ్ డెప్త్ ఉందనే విషయం ప్రేక్షకులకు అర్ధమైంది.