AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: రూ. 100కోట్ల ఇల్లు కొన్న నయనతార దంపతులు.. స్టూడియో స్టైల్‌లో డిజైన్ అదిరిపోయిందిగా..

నయనతార ఇప్పటివరకు 80 కి పైగా సినిమాల్లో నటించింది. ఆమె తనను తాను దక్షిణ భారత పరిశ్రమకే పరిమితం చేసుకోలేదు. ఆమె రజనీకాంత్, షారుఖ్ ఖాన్, నాగార్జున, జయరామ్ వంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. 2015లో, ఆమె ‘నానం రౌడీ ధన్’ సినిమా సెట్స్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను కలిసింది.

Nayanthara: రూ. 100కోట్ల ఇల్లు కొన్న నయనతార దంపతులు.. స్టూడియో స్టైల్‌లో డిజైన్ అదిరిపోయిందిగా..
Nayanthara
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2025 | 1:06 PM

Share

స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సినిమాల్లో నటించడమే కాకుండా, ఆమె ప్రస్తుతం చిత్రాలను నిర్మిస్తోంది కూడా.. దానితో పాటు పలు యాడ్స్ లోనూ నటిస్తుంది. అలాగే కొన్ని బిజినెస్‌లు కూడా చేస్తుంది ఈ చిన్నది. కాగా నయన్, దర్శకుడు విఘ్నేష్ శివన్ 2022 లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాల్లో నటిస్తూనే ఉంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ లవ్ ఇన్సూరెన్స్ కొంపానీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ జంట ఇప్పుడు చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. విశేషం ఏంటంటే ఆ ఇంటిని ఓ స్టూడియో మార్చారు ఈ జంట. ఈ ఇంటి విస్తీర్ణం దాదాపు 7,000 చదరపు అడుగులు.

ఇంకా, ఈ స్టూడియోలో వివిధ రకాల ప్రత్యేకమైన హస్తకళలు, వెరైటీ డిజైన్లు, కొత్త డిజైన్లతో నిండి ఉంది. అలాగే, ఈ స్టూడియో తరహా ఇంట్లో అందమైన చెట్లు, అందమైన గాజు కిటికీలు ఉన్నాయి. ఈ ఇంటి విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని కూడా చెబుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నయనతార, విఘ్నేష్ శివన్ కోలీవుడ్ సినిమాలో పాపులర్ జంట. వారి కొత్తగా నిర్మించిన పోయెస్ గార్డెన్ ఇంటి ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

నటి నయనతార నటించిన అన్నపూర్ణి చిత్రం చివరగా విడుదలైంది. ఈ సినిమా 2023లో విడుదలైంది. దీని తరువాత, 2024 లోఆమె నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. ఆమె ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘మూక్కుతి అమ్మన్ 2’లో నటిస్తోంది. వీటితో పాటు మన్నంకట్టి, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్, రాకాయ్ వంటి చిత్రాలలో ప్రధాన కథానాయికగా కూడా నటించింది. వీటిలో ముఖ్యంగా టెస్ట్ అనే సినిమా ఒకటి. ఈ చిత్రం ఏప్రిల్ 4, 2025న విడుదల కానుంది. ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, ఆర్. మాధవన్ తో పాటు నటి నయనతార కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది.

నయనతార కొత్త ఇల్లు ..  

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..