AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 సంవత్సరాల కిందటి కమర్షియల్ యాడ్.. ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. ఇంతకీ అందులో ఉన్న స్పెషలెంటంటే..

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న వీడియో వైరల్ అవుతుంది. ఇక ఇందులో అలనాటి సినిమాలు, వీడియో క్లిప్స్ ఏవీ కూడా సోషల్ మీడియాకు చిక్కకుండా ఉండవు.

17 సంవత్సరాల కిందటి కమర్షియల్ యాడ్.. ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. ఇంతకీ అందులో ఉన్న స్పెషలెంటంటే..
Megastar Chiranjeevi And Sh
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2021 | 1:48 PM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న వీడియో వైరల్ అవుతుంది. ఇక ఇందులో అలనాటి సినిమాలు, వీడియో క్లిప్స్ ఏవీ కూడా సోషల్ మీడియాకు చిక్కకుండా ఉండవు. అలనాటి సీనియర్ హీరోలకు సంబంధించిన వీడియోలతోపాటు కొన్ని సన్నివేశాలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా 17 క్రితం తీసిన ఓ కమర్షియల్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో స్పెషల్ ఏముంది అని ఆలోచిస్తున్నారా ? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు యాడ్స్ తీయాలంటే మెగాస్టార్ చిరంజీవి ముందుంటాడు. చిరుతో యాడ్ తీయడానికి కంపెనీలు క్యూ కట్టేవి. అప్పట్లో థమ్సప్, నవరత్న లాంటి యాడ్స్ ఎన్నో చేశాడు. అందులో ఎక్కువగా పాపులారిటీ సంపాదించింది మాత్రం థమ్సప్ అనే చెప్పుకోవాలి. ఒకప్పుడు థమ్సప్ కంపెనీకి మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవాడు. ప్రస్తుతం ఈ కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఇదిలా ఉండగా.. దాదాపు 17 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన థమ్సప్ యాడ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ యాడ్‏కు సంబంధించిన విషయాన్ని ఇటీవల జరిగిన శర్వానంద్ శ్రీకారం మూవీ ప్రీరిలీజ్ వేడుకలో చిరు గుర్తు చేసుకున్నాడు.

అప్పట్లో నేను థమ్సప్ యాడ్ చేస్తున్నప్పుడు నాతోపాటు నటించడానికి ఓ కొత్త కుర్రాడి కోసం వెతుకుతున్నారు. అప్పుడు మా ఇంట్లోనే ఉన్న శర్వానంద్‏ను నటిస్తావా.. నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే వెంటనే ఓకే చెప్పాడు.. అలా మేం కలిసి థమ్సప్ యాడ్ చేసామంటూ చెప్పుకోచ్చాడు చిరు. దీంతో మరుగున పడ్డ యాడ్ మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అందులో శర్వానంద్‏తో కలిసి చిరంజీవి పైట్ చేసారు. ఆ తర్వాత శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో నటించాడు శర్వానంద్. ఇటీవల విడుదలైన శ్రీకారం మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించారు. మీరు ఆ వీడియోను చూసేయ్యండి.

Also Read:

సుమ, రాజీవ్ కనకాల నుంచి ప్రియాంక మధుబాబు వరకు ప్రేమ పెళ్ళిళ్లు చేసుకున్న సీరియల్ నటీనటులు వీళ్లే..