Vaishnav Tej’s Kondapolam: థియేటర్స్ లో ఆకట్టుకోకున్నా.. టీవీలో అదరగొట్టింది.. కొండపాలానికి రికార్డ్ రేటింగ్..
మొదటి సినిమాలతోనే 100 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యి నయా రికార్డ్ క్రియేట్ చేశాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ కుర్ర హీరో ఉప్పెన సినిమా తో హీరోగా పరిచయంమైన విషయం తెలిసిందే
Vaishnav Tej’s Kondapolam: మొదటి సినిమాలతోనే 100 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యి నయా రికార్డ్ క్రియేట్ చేశాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ కుర్ర హీరో ఉప్పెన సినిమా తో హీరోగా పరిచయంమైన విషయం తెలిసిందే. సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతో అందాల ముద్దగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక ఉప్పెన సినిమా తర్వాత ఈ కుర్ర హీరో క్రిష్ దర్శకత్వంలో సినిమా చేశాడు. నిజానికి కుప్పేనా షూటింగ్ సమాయంలోనే ఈ సినిమా షూటింగ్ ను కూడా కంప్లీట్ చేశాడు వైష్ణవ్. కొండ పొలం అనే మనవలా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది.
ఈ మూవీ రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యింది. ఇక టీవీలో కూడా ఈ సినిమ రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ స్టార్ మాలో రిసెంట్ గా ప్రీమియర్ అయింది. టెలివిజన్ లో ప్రీమియర్ అయిన ఈ మూవీ 12.34 రేటింగ్ ని సాధించడం విశేషం. అలాగే . రూరల్ ఏరియాల్లో 10.54 రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికే పంజా వైష్ణవ్ తేజ్ తన థర్డ్ మూవీని పట్టాలెక్కించేశారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఈ సినిమా కు రంగ రంగ వైభవంగా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అలాగే సితార ఎంటర్ టైన్మెంట్స్ పార్చున్ 4 సినిమాస్ బ్యానర్ పై త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య సూర్య దేవర నాగవంశీ సంయుక్తంగా ఓ మూవీని నిర్మించబోతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :