సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్ మధ్య తరచూ వార్లు జరుగుతుంటాయి. ఒక హీరోపై మరొక హీరో అభిమానులు నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ చేస్తుంటారు. ఒక్కోసారి ఈ పైత్యం హై పిచ్కి వెళ్లిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా వెళ్లిపోతుంటాయి. అయితే ఈ గొడవలు అభిమానుల మధ్యే కానీ తమ మధ్య అలాంటివి ఉండవంటూ ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు తమ ఫ్యాన్స్కు తలంటు పోశారు. సినిమాల వరకే తమ మధ్య పోటీ ఉంటుందంటూ, తాము ఎప్పటికీ కలిసే ఉంటామని క్లారిటీ ఇస్తున్నారు. దీనిని మరోసారి నిరూపించాడు మంచు మనోజ్. ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో కాపురం పెట్టిన మంచు వారబ్బాయి మెగా హీరో, సుప్రీం సాయి ధరమ్ తేజ్కు బిర్యానీ పార్టీ ఇచ్చాడు. తేజ్ లేటెస్ట్ ఫిల్మ్ విరూపాక్ష గ్రాండ్ సక్సెస్ కావడంతో తన ఇంట్లోనే ప్రత్యేకంగా బిర్యానీ తయారుచేయించి మరీ మెగా హీరోకు బిర్యానీ పార్టీ ఇచ్చాడు మనోజ్. అనంతరం ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి. వీటిని చూసి అటు మెగాభిమానులు, మనోజ్ అభిమానులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.
రోడ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తేజ్ చేసిన చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ వంద కోట్ల క్లబ్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. మొదట తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఈ చిత్రం ఇటీవలే తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక మనోజ్ విషయానికొస్తే.. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు మనం మనం బరంపురం అనే మూవీ కూడా చేస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..