AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kala Ratri Movie OTT: స్నేహితుల మరణం చుట్టూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇప్పటివరకు ఎన్నో హారర్ సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోకి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'నల్ల నిళవుల రాత్రి' సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తెలుగులో కాళరాత్రి పేరుతో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.

Kala Ratri Movie OTT: స్నేహితుల మరణం చుట్టూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Kala Ratri
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2024 | 9:54 PM

Share

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో హారర్ కంటెంట్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొద్దిరోజులుగా సినీ ప్రియులను విభిన్న కంటెంట్ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పలు భాషలో డబ్బింగ్ చిత్రాలన్నీ నేరుగా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పటివరకు ఎన్నో హారర్ సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోకి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘నల్ల నిళవుల రాత్రి’ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తెలుగులో కాళరాత్రి పేరుతో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రంలో బాబు రాజ్, చెంబన్ వినోద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఆద్యంతం అనేక ట్విస్టులతో అలరించింది. ఇప్పుడు ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తుంది. తెలుగులో కాళరాత్రి పేరుతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆగస్ట్ 17 నుంచి అంటే శనివారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. మర్ఫీ దేవసి దర్శకత్వం వహించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇన్నాళ్లు మలయాళంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని.. అంటే ఇది వీకెండ్ లో మంచి ఆప్షన్ అనుకోవచ్చు.

కాళరాత్రి సినిమా కథ విషయానికి వస్తే.. ఓ స్నేహితుల బృందం అతి తక్కువ ధరకే వచ్చేస్తుందని 266 ఎకరాల తోట కొనడానికి వెళ్తుంటారు. తీర చూస్తే తోట మధ్యలో గెస్ట్ హౌస్.. అక్కడ పార్టీ చేసుకుంటారు. అయితే అనుహ్యంగా వీరి స్నేహితులలో కొందరు చనిపోతారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది..? అక్కడ జరిగిన హత్యలకు కారణం ఎవరు ? అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.