AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు సతీమణి మిస్ ఇండియా అని మీకు తెలుసా ?.. వైరలవుతున్న వీడియో.. ఎంత అందంగా ఉందో..

పెళ్లి తర్వాత నమ్రతా సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. వీరిద్దరు డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో ఏర్పడిన

Mahesh Babu: మహేష్ బాబు సతీమణి మిస్ ఇండియా అని మీకు తెలుసా ?.. వైరలవుతున్న వీడియో.. ఎంత అందంగా ఉందో..
Namratha, Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Dec 07, 2022 | 9:40 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ లవబుల్ కపూల్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంట సూపర్ స్టార్ మహేష్ బాబు.. నమ్రతా ఘట్టమనేని. ఘట్టమనేని కుటుంబానికి సినీ పరిశ్రమలోనే ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మహేష్ జీవితంలో నమ్రతా చాలా స్పెషల్ అని చెప్పుకొవాలి. వరుస సినిమాలతో సూపర్ స్టార్ బిజీగా ఉన్నా.. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలనే కాదు.. బిజినెస్ విషయాలను కూడా ఆమె ఒక్కరే దగ్గరుండి చూసుకుంటుంటారట. అంతేకాదు.. ప్రాజెక్ట్స్ ఎంచుకోవడంలోనూ తన భర్తకు హెల్ప్ చేస్తుంటారట. పెళ్లి తర్వాత నమ్రతా సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. వీరిద్దరు డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. 2005లో ఫిబ్రవరి 10న మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. వ్యాపారం.. ప్రొడక్షన్.. మహేష్ సినిమా ప్రచార కార్యక్రమాలను నమ్రతా దగ్గరుండి చూసుకుంటారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నమ్రతకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అదెంటంటే..ఆమె హీరోయిన్ కాకముందు 1993 లో మిస్ ఇండియాగా గెలిచిన నాటి వీడియో. మిస్ ఇండియాగా నమ్రతా ర్యాంప్ వాక్ చేసిన వీడియోలో ఆమె ఎంతో అందంగా కనిపిస్తుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నమ్రత.. ఆ తర్వాత కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. తెలుగులో వంశీ సినిమానే కాకుండా.. మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి చిత్రంలోనూ నటించింది నమ్రత.

ఇవి కూడా చదవండి

ఇక ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.