AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kshana Kshanam Pre Release Event LIVE: ‘క్షణక్షణం’ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్ లైవ్.. ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, బాబీ

‘ఆటగదరాశివ’, ‘మిస్ మ్యాచ్’ చిత్రాల్లో నటించిన ఉదయ్‌ శంకర్‌  ‘క్షణక్షణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘క్షణక్షణం’ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు హీరో ఉదయ్‌శంకర్‌.

Kshana Kshanam Pre Release Event LIVE: ‘క్షణక్షణం’ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్ లైవ్.. ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, బాబీ
Ram Naramaneni
|

Updated on: Feb 23, 2021 | 7:33 PM

Share

Kshana Kshanam Pre Release Event: ‘ఆటగదరాశివ’, ‘మిస్ మ్యాచ్’ చిత్రాల్లో నటించిన ఉదయ్‌ శంకర్‌  ‘క్షణక్షణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘క్షణక్షణం’ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు హీరో ఉదయ్‌శంకర్‌. తన సినీ జీవితాన్నిఈ సినిమా మలుపుతిప్పుతుందని చెబుతున్నారు. డార్క్ కామెడీ జోనర్‌గా కార్తిక్ మేడికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డాక్టర్ వర్లు, డాక్టర్ మన్నం చంద్రమౌళి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 26న విడుదల కానుంది.

తనది మధ్య తరగతి యువకుడి పాత్ర అని చెబుతోన్న ఉదయ్ శంకర్… మధ్య తరగతి ప్రజలు పడే కష్టాలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా అన్నీ ఉంటాయని వివరించారు. అనుకోని చిక్కుల్లో పడ్డ హీరో వాటి నుంచి ఎలా బయటపడ్డాడనేది కథాంశమని వెల్లడించారు.  కథలో ట్విస్టులు కూడా అదిరిపోయాయని చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు ప్రి-రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బాబి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు.

క్షణక్షణం ప్రి-రిలీజ్ ఈవెంట్ లైవ్ లింక్ దిగువన వీక్షించండి: