AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 16 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్.. 49 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇస్తున్న బ్యూటీ.. అందరి చూపు ఆమె పైనే..

సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసిన ఆమె.. మెగాస్టార్ చిరంజీవి నుంచి వెంకటేశ్, బాలకృష్ణ, రజినీకాంత్, అల్లు అర్జున్ వరకు అందరి హీరోలతో నటించింది. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. 49 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇస్తుంది.

Tollywood : 16 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్.. 49 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇస్తున్న బ్యూటీ.. అందరి చూపు ఆమె పైనే..
Rambha
Rajitha Chanti
|

Updated on: Feb 19, 2026 | 8:00 AM

Share

ఒకప్పుడు సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వారంతా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే అప్పట్లో నటీమణులుగా అలరించినవారు కొందరు సినిమాలలో కొనసాగుతున్నారు. మరికొందరు ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఓ సీనియర్ బ్యూటీ మళ్లీ సినిమాల్లో సందడి చేసేందుకు రెడీ అయ్యింది.1990 నుండి 2000 వరకు దక్షిణాది సినిమా రంగాన్ని ఏలిన తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఆ హీరోయిన్ తిరిగి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె కోసం సౌత్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె మరెవరో కాదు అందాల రాశి రంభ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

రంభ 1993లో ప్రభు నటించిన ‘ఉళవన్’ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. అంతకు ముందు ఏడాదిలో రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పుడు ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. మొదటి సినిమాతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించిన రంభ.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, రజినీకాంత్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో కలిసి అనేక చిత్రాల్లో నటించింది. అలాగే అల్లు అర్జున్, పూరి కాంబోలో వచ్చిన దేశ ముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ తో రచ్చ లేపింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

చివరగా 2010 పెన్ సింగం అనే సినిమాలో కనిపించింది. అదే ఏడాదిలో ఇంద్రకుమార్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రంభ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అయితే ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. 16 సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించనున్నట్లు సమాచారం.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

View this post on Instagram

A post shared by Rambha💕 (@rambhaindran_)

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? రెండో జాబితాపై క్లారిటీ
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? రెండో జాబితాపై క్లారిటీ
సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగినా.. మారని 'జీరో' స్టోరీ
సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగినా.. మారని 'జీరో' స్టోరీ
జామకాయను ఉప్పుతో కలిపి తినొచ్చా.? వీరు తింటే మాత్రం డేంజర్..
జామకాయను ఉప్పుతో కలిపి తినొచ్చా.? వీరు తింటే మాత్రం డేంజర్..
16 ఏళ్ల తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్..
16 ఏళ్ల తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్..
NH 44 పై ఘోర ప్రమాదం..ఏపీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా 20మందికి గాయాలు
NH 44 పై ఘోర ప్రమాదం..ఏపీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా 20మందికి గాయాలు
తిరుమల వెళ్లే భక్తులకు తీపికబురు.. టీటీడీ సరికొత్త ఆలోచన
తిరుమల వెళ్లే భక్తులకు తీపికబురు.. టీటీడీ సరికొత్త ఆలోచన
ఏపీ, తెలంగాణకు వచ్చే 2 రోజుల్లో అకాల వర్షాలు..
ఏపీ, తెలంగాణకు వచ్చే 2 రోజుల్లో అకాల వర్షాలు..
ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.. అయితే మీ పని ఖతమే..
ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.. అయితే మీ పని ఖతమే..
టీ20 ప్రపంచకప్ 2028కు 9 జట్లు ఫిక్స్.. ఆసీస్ పరిస్థితి ఏంటి?
టీ20 ప్రపంచకప్ 2028కు 9 జట్లు ఫిక్స్.. ఆసీస్ పరిస్థితి ఏంటి?
7 రోజుల్లో మార్పు కావాలా? ఉదయం ఖాళీ కడుపుతో ఈ పని మొదలు పెట్టండి!
7 రోజుల్లో మార్పు కావాలా? ఉదయం ఖాళీ కడుపుతో ఈ పని మొదలు పెట్టండి!