AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: 11 ఏళ్లకే నేషనల్ అవార్డ్.. కెరీర్ పీక్స్‏లో హోటల్లో అడ్డంగా దొరికిపోయింది.. దెబ్బకు కెరీర్ ఖతం..

చిన్న వయసులోనే బాలనటిగా తెరంగేట్రం చేసింది. 11 ఏళ్ల వయసులోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. కథానాయికగా తెలుగు సినిమా ప్రపంచంలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ హీరోయిన్.. అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

Actress: 11 ఏళ్లకే నేషనల్ అవార్డ్.. కెరీర్ పీక్స్‏లో హోటల్లో అడ్డంగా దొరికిపోయింది.. దెబ్బకు కెరీర్ ఖతం..
Shwetha Basu Prasad
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2025 | 2:09 PM

Share

సినిమా రంగుల ప్రపంచంలో నటిగా ఓ వెలుగు వెలగడం అంత సులభం కాదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు.. అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఓ హీరోయిన్ మాత్రం ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయింది. దీంతో దెబ్బకు కెరీర్ క్లోజ్ అయ్యింది. ఆ తర్వాత తన స్నేహితుడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. వైవాహిక బంధం సైతం ఎక్కువ కాలం సాగలేదు. దీంతో భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్.

ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

2002లో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన మక్దీ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. 11 ఏళ్ల వయసులోనే ద్విపాత్రాభినయం చేసింది. ఆమె నటనకు ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. హిందీలో బాలనటిగా పలు సినిమాల్లో నటించింది. కహానీ ఘర్ ఘర్ కీ సీరియల్ ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. దీంతో బుల్లితెరపై ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వరుణ్ సందేశ్ సరసన కొత్త బంగారు లోకం సినిమాతో కథానాయికగా మారింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ 2014లో ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ సమయంలో వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యింది. ఆ తర్వాత తన తప్పు లేకున్నా తనను ఆ కేసులో ఇరికించారని తెలిపింది.

Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..

2018లో తన స్నేహితుడు నిర్మాత రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ వివాహం ఎక్కువకాలం కొనసాగలేదు. 2019లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయిన శ్వేత ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ చేస్తూ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..

ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..