
కేరళలో థియేటర్ల యజమానులు, నిర్మాతల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇకపై మలయాళ సినిమాలను ప్రదర్శించకూడదని కేరళ సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమ సందిగ్ధంలో పడింది. శుక్రవారం (ఫిబ్రవరి 16) సమావేశమైన కేరళ సినిమా ఓనర్స్ ఫెడరేషన్ (FEUOK) ఫిబ్రవరి 22 నుంచి కేరళలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎలాంటి మలయాళ సినిమాలను ప్రదర్శించబోమని ప్రకటించింది. కేరళ సినిమా ఓనర్స్ అసోసియేషన్, మలయాళ చిత్ర నిర్మాతల మధ్య గత రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఓటీటీలో సినిమాల విడుదలను కేరళ సినిమా ఓనర్స్ అసోసియేషన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. సినిమా విడుదలైన నెల రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్నది సినిమా యజమానుల డిమాండ్. గతంలో దీనికి సంబంధించి ఓ సమావేశం నిర్వహించి మలయాళ సినిమా విడుదలైన 42 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన విధించారు. ఈ నిబంధనకు నిర్మాతలు కూడా అంగీకరించారు. అయితే కొందరు నిర్మాతలు పదే పదే ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. మోహన్లాల్ కథానాయకుడిగా ఇటీవల విడుదలైన ‘మలైకోట్టై వాలిబన్’ చిత్రం కొద్ది రోజుల్లోనే OTTలోకి రానుంది. ఇది కేరళ థియేటర్ యజమానులను మరింత ఆగ్రహానికి గురిచేసింది, అందుకే వారు శుక్రవారం సమావేశం నిర్వహించి ఇకపై మలయాళ సినిమాలను ప్రదర్శించకూడదని నిర్ణయం ప్రకటించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఓటీటీ రిలీజ్ లు..
Theatres in Kerala to stop new Malayalam releases! Film Exhibitors United Organisation of Kerala (FEUOK) has announced that it won’t screen new Malayalam films that are slated to release from Feb 22 as the film producers continue to violate the #OTT window-period norms (42 days)… pic.twitter.com/yfKYeJbWuo
— Sreedhar Pillai (@sri50) February 17, 2024
Sharing screen space with @Mohanlal sir in @mrinvicible ‘s world!
What more could I have asked for 😇
Thank you @VaalibanMovie @AchuBJohn @Johnmaryctve @shibu_babyjohn @CenturyFilms #sonaleekulkarni #marathimulgi in #malayalamcinema #incinemasnow #MalaikottaiVaaliban pic.twitter.com/aYioqRSuLf
— Sonalee Kulkarni (@meSonalee) February 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.