AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోనితో నా రిలేషన్ ఓ మాయని మచ్చ.. అప్పట్లో అలా..! స్టార్ హీరోయిన్ అలా అనేసిందేంటీ..!!

స్టార్ హీరోయిన్స్ చాలా మాది ఇప్పుడు ఇండస్ట్రీకిఈ దూరంగా ఉంటున్నారు. కొంతమంది అవకాశాలు అందుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. మరికొంతమంది అనేక కారణాలతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న అందాల భామ కూడా వారిలో ఒకరు. ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్, పవర్ స్టార్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.

ధోనితో నా రిలేషన్ ఓ మాయని మచ్చ.. అప్పట్లో అలా..! స్టార్ హీరోయిన్ అలా అనేసిందేంటీ..!!
Ms Dhoni
Rajeev Rayala
|

Updated on: May 12, 2025 | 8:24 AM

Share

టాలీవుడ్ లో ఈ అమ్మడు ఓ హాట్ బ్యూటీ. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది. హీరోయిన్ గా రాణిస్తూనే స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టింది. నిజానికి హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ వయ్యారి భామ. కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది పలు యాడ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యింది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? స్టార్ హీరోలతో స్టెప్పులేసింది.. అలాగే స్టార్ క్రికెటర్స్ తో ఎఫైర్స్ పెట్టుకుంది ఈ భామ. తాజాగా ఆమె స్టార్ క్రికెటర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆ భామ ఎవరంటే..

రాయ్ లక్ష్మి 2005లో తమిళ చిత్రం “కర్క కసదర”తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది కన్నడ చిత్రం “వాల్మీకి” లో శివ రాజ్‌కుమార్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో “కంచనమాల కేబుల్ టీవీ” (2005), “నీలి మేఘం” (2012), “బలుపు” (2013) వంటి చిత్రాలలో నటించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణలాంటి స్టార్ హీరోలతో స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల స్పీడ్ తగ్గించింది.

నటి రాయ్ లక్ష్మీ మహేంద్ర సింగ్ ధోనితో తనకు గతంలో ఉన్న రిలేషన్‌షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాయ్ లక్ష్మీ ధోనితో తన సంబంధాన్ని “ఒక మచ్చ” గా అభివర్ణించింది. భవిష్యత్తులో తన పిల్లలు ఈ విషయం గురించి ప్రశ్నిస్తే తాను ఎలా సమాధానం చెప్పాలోనని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే గతంలో ధోనితో తనకు సంబంధం ఉందని వచ్చిన వార్తలను తాజాగా తవ్వి తీస్తున్నారని, ఇంటర్నెట్‌లో ఈ విషయాలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయని రాయ్ లక్ష్మీ అసహనం వ్యక్తం చేసింది. ఈ పిచ్చి ప్రచారాన్ని దూరం పెట్టాలని కోరింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.