Tollywood: ఓరి నాయనో.. ఈ పాప.. ఇప్పుడు తెలుగునాట మెంటలెక్కించే హీరోయిన్

|

Aug 24, 2024 | 12:23 PM

ఈ పాప ఇప్పుడు తెలుగునాట పెద్ద హీరోయిన్. తనకు ఓ నిక్ నేమ్ ఉంది. అదే పేరుతో పిలుస్తూ ఉంటారు ఆమె ఫ్యాన్స్. అందాల ఆరబోతలో ఎప్పుడూ ముందుంటుంది. ఎవరో గెస్ చేయగలరా..?

Tollywood: ఓరి నాయనో.. ఈ పాప.. ఇప్పుడు తెలుగునాట మెంటలెక్కించే హీరోయిన్
Heroine Childhood Photo
Follow us on

నెట్టింట.. సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా సర్కులేట్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. తను ఫలానా హీరో, హీరోయిన్ అంటే నమ్మలేకపోతున్నారు. పైన ఫోటోలోని పాప ఇప్పుడు పెద్ద హీరోయిన్. తెలుగులో వరస సినిమాలు చేస్తోంది. తన హాట్ ఫోజులతో కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది. ఎవరో గుర్తుపట్టగలరా..? క్లూ ఏంటంటే.. పూరి జగన్నాథ్ మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఏంటి ఇంకా గెస్ చేయలేకపోయారా మేమే చెప్పేస్తాం.. తను కుర్రాళ్లు రాధిక అని ముద్దుగా పిలుచుకునే నేహశెట్టి. పూరీ డైరెక్షన్‌లో వచ్చిన మెహబూబా సినిమా ద్వారా నేహా.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా ఫలితం ఆశించినట్టుగా రాలేదు. కానీ ఈ బ్యూటీ మాత్రం కుర్రాళ్లకు కనెక్ట్ అయింది. దీంతో అందాల ఆరబోతకు తెరతీసింది.  ఆ తర్వాత వచ్చిన నేహ సినిమా గల్లీ రౌడీ కూడా ఆడలేదు. నెక్ట్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ఇలా అపజాయాల బాటలో ఉన్న నేహాకు… డిజే టిల్లు దిమ్మతిరిగిపోయే సక్సెక్ ఇచ్చింది. 2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా నేహా ఫేట్ మారిపోయింది. రాధిక పాత్రలో ఆమె జీవించింది అనే చెప్పాలి. ఈ మూవీ తర్వాత నేహాను చాలామంది రాధిక అనే పిలుస్తున్నారు. ఇదే ఊపులో.. యంగ్ హీరో కార్తికేయ సరసన బెదురులంక..  కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్  సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు సక్సెస్ అవ్వలేదు. టిల్లు స్క్వేర్‌లో అతిథి పాత్ర వేసి. రాధికగా మళ్లీ రంజింపజేసింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నటించగా.. అది సో సోగా ఆడింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు ఏం లేవు.

ఇక సినిమాలన్నీ సంగతి పక్కనపెడితే.. సోషల్ మీడియాలో అమ్మడి ఫోటోల రచ్చ మాములుగా ఉండదు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్‌తొ నేహా కొంటెకారును కవ్విస్తూ ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.