AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal and Arya: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కను నాటి..తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టిన విశాల్

Hero Vishal and Arya: తెలంగాణలో చేపట్టిన మొక్కల యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. కాలాల్ని, సంస్కృతుల్ని..

Vishal and Arya: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కను నాటి..తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టిన విశాల్
Hero Vishal
Surya Kala
|

Updated on: Nov 01, 2021 | 6:36 PM

Share

Hero Vishal and Arya: తెలంగాణలో చేపట్టిన మొక్కల యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. కాలాల్ని, సంస్కృతుల్ని, స్మృతుల్ని తనలో మిలితం చేసుకొని సరికొత్తగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు “ఎనిమీ” సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హీరో విశాల్, ఆర్య, నటి మిర్నాళిని రవి “గ్రీన్ ఇండియా చాలెంజ్” లో భాగంగా హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

అనంతరం విశాల్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రభుత్వ మానసపుత్రిక “హరితహారం” స్పూర్తితో ప్రారంభించిన “గ్రీన్ ఇండియా చాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో వారు ప్రారంభించిన ఈ “గ్రీన్ ఇండియా చాలెంజ్” గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి దోహదపడుతుందని చెనప్పారు. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని విశాల్ కోరారు. అంతేకాదు తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఈరోజు మొక్కని నాటుతున్నానని.. ఈ మొక్క తన స్నేహితునికి గుర్తుగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో నటుడు ఆర్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వామ్యం అయి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కి నటుడు ఆర్య ధన్యవాదాలు తెలిపారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా నటి మిర్నాళిని రవి కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. అనంతరం “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని ‘ఎనిమీ’ చిత్ర బృందానికి అందజేశారు.

Also Read:  కప్పు టీతో ఆస్వాదించడానికి రుచికరమైన బ్రెడ్ ఆలూ పకోడా రెసిపీ మీకోసం..