AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిమాని ఆకస్మిక మరణం.. గుండె పగిలింది అంటూ మహేష్ ట్వీట్

అభిమాని లేనిదే హీరోలు లేరు. ఈ విషయం హీరోలకు కూడా తెలుసు. అందుకే ఫ్యాన్స్ ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, చేయూత ఇచ్చేందుకు రెడీగా ఉంటారు మన టాలీవుడ్ హీరోలు. ఇక ఎప్పుడూ వెన్నంటి నిలిచే అభిమానుల్లో ఎవరైనా ఆకస్మిక మరణం చెందింతే ఆ హీరో పడే బాధ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు అదే వేదనలో ఉన్నారు. నెల్లూరు జిల్లా నటశేఖర కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం ప్రెసిడెంట్ దాసరి సురేష్ […]

అభిమాని ఆకస్మిక మరణం.. గుండె పగిలింది అంటూ మహేష్ ట్వీట్
Ram Naramaneni
|

Updated on: Sep 11, 2020 | 2:08 PM

Share

అభిమాని లేనిదే హీరోలు లేరు. ఈ విషయం హీరోలకు కూడా తెలుసు. అందుకే ఫ్యాన్స్ ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, చేయూత ఇచ్చేందుకు రెడీగా ఉంటారు మన టాలీవుడ్ హీరోలు. ఇక ఎప్పుడూ వెన్నంటి నిలిచే అభిమానుల్లో ఎవరైనా ఆకస్మిక మరణం చెందింతే ఆ హీరో పడే బాధ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు అదే వేదనలో ఉన్నారు.

నెల్లూరు జిల్లా నటశేఖర కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం ప్రెసిడెంట్ దాసరి సురేష్ బాబు గురువారం తుదిశ్వాస విడిచారు. సురేష్ బాబు మరణవార్త తెలిసి మహేష్ బాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆయన అకాల మరణవార్త విని తన గుండె బద్ధలైందని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ట్వీట్ చేశారు. ‘‘దాసరి సురేష్ బాబు అకాల మరణం గురించి విని నా గుండె పగిలింది. నిజంగా ఆయన్ను మిస్సవుతున్నాను. ఇలాంటి విపత్యర పరిస్థితిలో ఆయన కుటుంబానికి మరింత ప్రేమ, సామర్థ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని మహేష్ బాబు ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, దాసరి సురేష్ బాబు అంత్యక్రియలు గురువారం సాయంత్రం నెల్లూరులో ముగిసాయి. ఘట్టమనేని ఫ్యామిలీ  అభిమానులు భారీ సంఖ్యలో ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బైక్ ర్యాలీతో సురేష్ బాబు అంతిమ యాత్ర నిర్వహించారు.

Also Read : ఏఆర్‌ రెహమాన్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు