
పైన ఫోటోలో కనిపిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కేరళ కుట్టి. బాలనటిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి కథానాయికగానూ సక్సెస్ అయ్యింది. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా అడియన్స్ను అలరించింది. ఈ క్యూటీ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. న్యాచురల్ స్టార్ నాని, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ సినిమాల్లో నటింటి ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ నివేదా థామస్. 1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించిన నివేదా.. 2002లో మలయాళం మూవీ ‘ఉత్తర’లో బాలనటిగా తెరంగేట్రం చేసింది.
ఆ తర్వాత సన్ టీవీలో అప్పట్లో ప్రసారమైన మై డియర్ భూతం సీరియల్లో నటించింది. బాలనటిగా అలరించిన ఈ చిన్నది.. మలయాళంలో అనేక చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో నివేద తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్, మీట్ క్యూట్, శాకిని డాకిని చిత్రాల్లో నటించింది.
తెలుగు, మలయాళంలో కాకుండా.. తమిళంలోనూ పలు సినిమాల్లో నటించింది నివేదా. ఇక ఈ ఏడాది ఎంతడా సాజి అనే మలయాళ మూవీలో కనిపించింది. అలాగే తెలుగులో శాకిని డాకిని చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది నివేదా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.