AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ బీభత్సం..

గుంటూరు కారం సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి ఇప్పటివరుక ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ బీభత్సం..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Jan 26, 2025 | 9:12 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం వంటి హిట్ మూవీ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ చిత్రాన్ని జక్కన్న భారీ హైప్ మధ్య హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆఫ్రీకన్ అడువుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించనున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్స్, హాలీవుడ్ నటీనటులు కూడా కనిపించనున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు మహేష్. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనున్నట్లు టాక్. రైటర్ విజయేంద్రప్రసాద్ అందించిన ఈ కథను జక్కన్న పాన్ వరల్డ్ మూవీగా తీసుకువస్తున్నారు. ఇందులో మహేష్ లుక్ కొత్తగా ఉండనుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

పైన ఫోటోను చూశారు కదా. అందులో మహేష్ బాబు పక్కన కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఆఫర్స్ అందుకుంటున్న క్రేజీ హీరోయిన్. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ రమ్య పసుపులేటీ. ఇటీవలే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి హిట్ అందుకుంది. అలాగే ఇప్పుడిప్పుడే ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.

ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఇందులో చిరంజీవి చెల్లెలిగా కనిపించనుందని టాక్. ప్రస్తుతం నెట్టింట రమ్య పసుపులేటి ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..