AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం రేంజ్ గురూ..! సినిమాకు రూ. 30కోట్లు అందుకుంటున్న రామ్ చరణ్ హీరోయిన్

చాలా మంది నటీమణులు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. అలాగే మరి కొంతమంది హీరోయిన్స్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ హీరోయిన్ ఏకంగా హీరోలకు డబుల్ రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది.

ఏం రేంజ్ గురూ..! సినిమాకు రూ. 30కోట్లు అందుకుంటున్న రామ్ చరణ్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2025 | 10:19 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ స్టార్స్ గా రాణిస్తున్నారు. హీరోలకు ఏమాత్రం తీసిపోని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటూ..నిర్మాతలకు పెద్ద షాక్ ఇస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ మాత్రం ఇప్పుడున్న హీరోయిన్స్ అందరిలో టాప్. సినిమాల్లోనే కాదు రెమ్యునరేషన్ లోనూ తోప్ ఆమె. రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈ పాన్ ఇండియా స్టార్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ హీరోలకు మించి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రియాంక చౌప్ర ఒకరు. ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ గా రాణిస్తుంది. బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన ప్రియాంక. హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. బాలీవుడ్ లోనే ఆమె అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ ఆమె.. ఆతర్వాత హాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ కూడా స్టార్ గా రాణించింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన జంజీర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది.

ఇది కూడా చదవండి :తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్

ఇదే సినిమా తెలుగులో తుఫాన్ గా విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ చిన్నది పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తుంది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘క్రిష్ 2’, ‘క్రిష్ 3’లో ప్రియాంక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు క్రిష్ 4లో నటిస్తుంది. ఈ సినిమాకు హృతిక్ రోషన్ దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రియాంక రూ. 30 కోట్లు అందుకుంటుందని తెలుస్తుంది. అలాగే ప్రియాంక చోప్రా మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకోసం ప్రియాంక రూ. 30 కోట్లు అందుకుంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇది కూడా చదవండి : Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.