ధనుష్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. అతడి కెరీర్లో ఇది 50వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రివెంజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ధనుష్ చెల్లెలుగా నటించిన అమ్మాయి గుర్తుందా.? ఆమె ఎవరో మీకు తెలుసా.?
రాయన్ సినిమాలో ఎంతోమంది స్టార్ నటులు నటించినప్పటికీ.. ఈమె తన పాత్రలో జీవించిందని చెప్పొచ్చు. సినిమాకే హైలైట్గా నిలిచే పాత్ర ఈమెది. పక్కా పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించిన ఈ అందాల భామ.. తన నటనతో అందరిని కట్టిపడేసింది. మరి ఇంతకీ ఆమె ఎవరు.? సినీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది.? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..
ధనుష్ చెల్లెలుగా నటించిన ఆమె పేరు ‘దుషారా విజయన్’. ఈమె తమిళ హీరోయిన్. నిన్న మొన్నటి వరకు ఈమె గురించి అందరికీ తెలిసింది తక్కువే.. కానీ ఈ సినిమాతో ఆమె పేరు ఇండస్ట్రీ అంతటా మారుమ్రోగుతోంది. ఫ్యాషన్ డిజైనర్గా తన కెరీర్ ప్రారంభించిన దుషారా విజయన్.. సినిమాలపై ఆసక్తితో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిన్నది రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయి. 2019లో ‘బోదై ఏరి బుద్ధి’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ద్వారా నటనకు గానూ మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘సార్పట్టా పరంబరై’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ వయ్యారికి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.
‘నక్షత్రం’, ‘నగర్గిరదు’, ‘కళువేత్తి’, ‘మూర్కన్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. రజినీకాంత్తో ‘వేట్టైయాన్’, విక్రమ్ సరసన ‘వీర ధీర శూరన్’ వంటి భారీ ప్రాజెక్ట్లలోనూ దుషారా విజయన్ నటించింది. ఈ నేపధ్యంలోనే ఆమెకు ‘రాయన్’ ఛాన్స్ వచ్చింది. కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో దుషారా విజయన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్గా మారాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
ఇది చదవండి: ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్లో.. ఇప్పుడేమో నడుమందాలతో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి