క్లైమాక్స్ బాలేదు మార్చాలన్నారు అన్నారు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్గా నిలిచింది.. మూడు స్టేట్ అవార్డు గెలుచుకుంది
నిర్మాతలు భగవాన్, పుల్లారావు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సముద్రం’ చిత్రం నిర్మాణ విశేషాలను పంచుకున్నారు. జగపతి బాబు పాత్ర, బడ్జెట్కు మించి ఖర్చు చేసిన వైనం, క్లైమాక్స్ మార్పులు, డీటీఎస్ నిర్ణయాలతో పాటు సినిమా విజయం, అందుకు కారణమైన కృష్ణవంశీ పనితనం, అవార్డుల గురించి వెల్లడించారు.

నిర్మాతలు భగవాన్, పుల్లారావు ‘సముద్రం’ సినిమా నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, ఆసక్తికర అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్గా నిలిచిందని, అప్పట్లో అంత రాగా, రియలిస్టిక్గా సినిమా తీయడం అద్భుతమని పేర్కొన్నారు. ‘అంతఃపురం’ విజయంతో కృష్ణవంశీ హాట్ కేక్గా ఉన్న సమయంలో, ఆయన్ని ‘సముద్రం’ కోసం ఒప్పించడంలో నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. బడ్జెట్కు మించి ఖర్చు చేసే వ్యక్తిగా కృష్ణవంశీకి పేరున్నప్పటికీ, జగపతి బాబు హామీతో నిర్మాతలు ధైర్యం చేసి ముందుకెళ్లారు. సినిమా రష్ చూసిన తర్వాత, క్లైమాక్స్ చూసి ఇంకొంచం బాగుండాలి అని , విలన్ పాత్ర ఇంకా బలంగా ఉండాలని నిర్మాతలు సూచించారట.
బడ్జెట్ పెరుగుతుందని కృష్ణవంశీ అడిగినా, ఒక సూపర్ హిట్ సినిమా కోసం ఎంత ఖర్చుకైనా సిద్ధపడతామని నిర్మాతలు చెప్పారు. వారి మాట నిలబెట్టుకుని, అదనపు షెడ్యూల్ ప్లాన్ చేసి క్లైమాక్స్ను మెరుగుపరిచారు. అలాగే, డీటీఎస్ కోసం కూడా బడ్జెట్ పరిమితులు ఉన్నా, సినిమా క్వాలిటీని దృష్టిలో ఉంచుకొని నిర్మాతలే చొరవ తీసుకున్నారు. ఈ నిర్ణయాలు ‘సముద్రం’ విజయాన్ని సుసాధ్యం చేశాయి. ఈ చిత్రం మూడు స్టేట్ అవార్డులను గెలుచుకోవడమే కాకుండా, నిర్మాతలకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ముఖ్యంగా తనికెళ్ళ భరణి విలన్ పాత్రకు రాష్ట్ర అవార్డు రావడం గమనార్హం. ఆయన పని రాక్షసుడని, ఆయనతో పనిచేయడం పెద్ద సవాలని నిర్మాతలు అభివర్ణించారు.
తర్వాత, రాజశేఖర్ హీరోగా రూపొందించిన ‘మనసున్న మహారాజు’ సినిమా గురించి ప్రస్తావించారు. రాజశేఖర్ షూటింగ్కు ఆలస్యంగా వస్తారనే అభిప్రాయం ఉన్నప్పటికీ, దర్శకుడు ముత్యాల సుబ్బయ్య అప్పటికే ఆయనతో ఐదు ఆరు సినిమాలు చేసి మంచి అనుబంధం ఉండటంతో, ఆ డౌట్ పెట్టుకోవద్దని హామీ ఇచ్చారట. రాజశేఖర్ అద్భుతమైన నటుడని, ఆయనతో సినిమా చేయడం మంచి అనుభవమని తెలిపారు. ‘మనసున్న మహారాజు’లోని ఒక ప్రత్యేకమైన ట్రాక్, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘మంగళవారం’ అనే మలయాళం రీమేక్ చిత్రంలోని ట్రాక్ను పోలి ఉంటుందని, అయితే ‘మనసున్న మహారాజు’లో ఆ కామెడీ ట్రాక్ను రైటర్స్ ద్వారా డవలప్ చేశారని వివరించారు. ఈ సినిమాలో మదర్గా నటించిన ప్రముఖ నటి మనోరమ గురించి మాట్లాడుతూ, ఆమె గిన్నిస్ రికార్డ్ హోల్డర్ అని, చాలా సహృదయం, సహకారంతో పనిచేసే వ్యక్తి అని కొనియాడారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
