AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Bhasker: సీక్వెల్‌పై డైరెక్టర్ ఫోకస్.. హీరో క్యారెక్టర్‌‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

చిన్న సినిమా తీసి పెద్ద హిట్ కొట్టడం మామూలే. కానీ, పెద్ద హీరోను పెట్టి సినిమా తీసి సైలెంట్‌గా రిలీజ్ చేసి భారీ హిట్ అందుకున్నారు వెంకీ అట్లూరి. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీసి మరోసారి భారీ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఫైనాన్స్ ఫ్రాడ్ థ్రిల్లర్‌‌గా వచ్చిన ఆ సినిమాలో హీరో క్యారెక్టర్‌‌ను హైలైట్ చేస్తూ కథ రాసుకుంటున్నారట..

Lucky Bhasker: సీక్వెల్‌పై డైరెక్టర్ ఫోకస్.. హీరో క్యారెక్టర్‌‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Lucky Bhaskar
Nikhil
|

Updated on: Dec 22, 2025 | 11:17 AM

Share

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇటీవల కాలంలో ఒక చిన్న సినిమాగా వచ్చి కళ్లు చెదిరే విజయాన్ని అందుకున్న సినిమా లక్కీ భాస్కర్. సాధారణ మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి కథను, 90వ దశకంలో జరిగిన ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో మలిచిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. మలయాళ స్టార్ హీరో తెలుగులో నేరుగా నటించి తన నటనతో అందరినీ మాయ చేసిన ఈ ప్రాజెక్ట్, విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా భారీ వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఆ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు ఈ కథకు రెండో భాగం అంటే సీక్వెల్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ బ్యాంకింగ్ డ్రామాలో దుల్కర్ సల్మాన్ నటన సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఒక సామాన్యుడు తన తెలివితేటలతో వ్యవస్థలోని లోపాలను వాడుకుని కోట్లు ఎలా సంపాదించాడు అనే పాయింట్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. కథ ముగింపులో కూడా సీక్వెల్ కి చిన్న హింట్ ఇచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా సీక్వెల్ పై దర్శకుడు ఇప్పటికే ఒక ప్రాథమిక ఆలోచనకు వచ్చారు. భాస్కర్ పాత్ర ప్రయాణం మొదటి భాగంలో ముంబైలో ముగిసినప్పటికీ, రెండో భాగంలో దానిని మరింత ఉన్నత స్థాయిలో చూపించాలని ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి సీక్వెల్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్‌గా మారాయి. ఒక సినిమా హిట్ అయితే చాలు దానిని ఫ్రాంచైజీగా మార్చేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి కూడా తన తదుపరి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఇద్దరూ తమ ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

ఈ సీక్వెల్ లో కేవలం ఆర్థిక అంశాలే కాకుండా, భాస్కర్ కుటుంబం ఎదుర్కొనే సవాళ్లు, అలాగే అతను సృష్టించిన ఆర్థిక సామ్రాజ్యం చుట్టూ తిరిగే రాజకీయాలను కూడా జోడించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి భాగంలో తన నటనతో ఫిదా చేసిన మీనాక్షి చౌదరి కూడా ఈ సీక్వెల్ లో కొనసాగుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఈ వార్త విన్న అభిమానులు మాత్రం ‘భాస్కర్ ఈజ్ బ్యాక్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అధికారిక ప్రకటన వస్తే తప్ప అసలు విషయం తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్ మాత్రం ప్రస్తుతానికి టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.