బాలయ్యతో రోజా సెల్ఫీ.. నోరుపారేసుకున్న ఆర్జీవీ!

| Edited By:

Jan 23, 2020 | 12:54 PM

ఎప్పుడూ నోటి దురుసుతనంతో.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే వ్యక్తి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఆయన మరోసారి తన నోటికి పని చెప్పారు. నిన్న శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలుసుకున్న విషయం తెలిసిందే. వారు కలిసిన సందర్భంగా.. రోజా, బాలయ్యతో పాటు మరికొందరు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని కాస్తా సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ ఫొటోలో చంద్రబాబు కూడా ఉన్నారు. ఎప్పుడూ టీడీపీ అధినేత […]

బాలయ్యతో రోజా సెల్ఫీ.. నోరుపారేసుకున్న ఆర్జీవీ!
Follow us on

ఎప్పుడూ నోటి దురుసుతనంతో.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే వ్యక్తి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఆయన మరోసారి తన నోటికి పని చెప్పారు. నిన్న శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలుసుకున్న విషయం తెలిసిందే. వారు కలిసిన సందర్భంగా.. రోజా, బాలయ్యతో పాటు మరికొందరు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని కాస్తా సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ ఫొటోలో చంద్రబాబు కూడా ఉన్నారు. ఎప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబుపై నోరుపారేసుకునే రోజా.. బాలయ్యతో ఫొటో దిగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

కాగా.. ఈ ఫొటోపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఫుల్ సెటైర్లు విసిరారు. ‘సెల్ఫీలో రోజా హీరోలా కనిపిస్తోంది. కానీ ఆమె పక్కన ఎవరోగానీ చాలా అసహ్యంగా కనిపిస్తున్నారు. అతను రోజా అందాన్ని పాడు చేస్తున్నాడు’ అంటూ తీవ్రమైన విమర్శలు చేశారు. రోజా, బాలకృష్ణ రాజకీయంగా అధికార పక్షం, ప్రతిపక్షాలైనా.. వారిద్దరూ నటులు. చాలా సినిమాల్లో నటించారు కూడా. ఇంతవరకూ బాలకృష్ణ రోజాను దూషించడం కానీ.. ఆమె బాలయ్యను దూషించడం కానీ జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే రోజాకు బాలయ్య రాజకీయ గురువు. ఆయన ప్రోద్భలంతోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చింది.