Pushpa: బన్నీ సినిమా మార్నింగ్ షో టికెట్లు కావాలన్న దర్శకుడు.. హీరోయిన్ రిప్లై ఏంటంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో సందడి చేయనుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో సందడి చేయనుంది. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈనేపథ్యంలో సిల్వర్ స్ర్కీన్పై ‘పుష్ప’ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా బన్నీ సన్నిహితుడు, ప్రముఖ డైరెక్టర్ మారుతి కూడా స్టైలిష్ స్టార్ సినిమా టిక్కెట్లు కావాలంటున్నాడు. ట్విట్టర్ వేదికగా ‘హైదరాబాద్లో ‘పుష్ప’ మార్నింగ్షో కావాలని’ పోస్ట్ పెట్టిన ఆయన దీనికి హీరో బన్నీ, డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ను ట్యాగ్ చేశాడు.
ఇందులో ‘పార్టీ లేదా పుష్పా’ అని ఫాహద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్ ను ‘ టికెట్లు లేవా పుష్పా’ అని మార్చిన ఫొటోను షేర్ చేశాడు. కాగా ఈ పోస్టుపై రాశీ ఖన్నా స్పందించింది. ‘కష్టం సార్.. నేను కూడా ట్రై చేస్తున్నా’ అంటూ స్మైలీ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. కాగా మారుతి తెరకెక్కించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. ‘ఏంజెల్ ఆర్ణ’ అనే పాత్రలో సందడి చేసింది. ప్రస్తుతం అతని దర్శకత్వంలోనే ‘పక్కా కమర్షియల్’ సినిమాలోనూ రాశీనే హీరోయిన్. గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా విడుదల కానుంది.
Early show Hyderabad Tickets kaavali #Pushpa @alluarjun @aryasukku @MythriOfficial pic.twitter.com/1yiDxuMzbM
— Director Maruthi (@DirectorMaruthi) December 16, 2021
Also Read:
Sree Vishnu: అర్జునుడి ఆగమనానికి డేట్ ఫిక్స్.. శ్రీ విష్ణు కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..
Urvashi Rautela: డైమండ్స్తో రూపొందించిన డ్రెస్తో బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ధర ఎంతంటే..