AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Captain Miller OTT : ఒక్కరోజే ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేసిన కెప్టెన్ మిల్లర్..

థియేటర్స్ లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. కొన్ని నయా రికార్డ్ కూడా క్రియేట్ చేశాయి. తాజాగా ధనుష్ సినిమా కూడా ఓటీటీలో దుమ్మురేపుతోంది. ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Captain Miller OTT : ఒక్కరోజే ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేసిన కెప్టెన్ మిల్లర్..
Captain Miller
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2024 | 8:33 PM

Share

ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా సినిమాలకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. థియేటర్స్ లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. కొన్ని నయా రికార్డ్ కూడా క్రియేట్ చేశాయి. తాజాగా ధనుష్ సినిమా కూడా ఓటీటీలో దుమ్మురేపుతోంది. ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ సినిమా థియేటర్స్ లో పర్లేదు అనిపించుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

సంక్రాంతి కానుకగా కెప్టెన్ మిల్లర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. తమిళ్ లో ముందుగా రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ సినిమా ఆతర్వాత తెలుగులో రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సంక్రాంతికి తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్రవరి 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది కెప్టెన్ మిల్లర్ సినిమా.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఒక్కరోజులోనే ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకొని ట్రెండింగ్ లో నిలిచింది కెప్టెన్ మిల్లర్ సినిమా. నిన్నటి వరకు వెంకటేష్ హీరోగా నటించిన సైందవ్ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా దాన్ని వెనక్కి నెట్టి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమాలో ధనుష్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే ఈ సినిమాలో యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించాడు. అలాగే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ మ్లరో కీలక పాత్రలో నటించాడు.

ధనుష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Dhanush (@dhanushkraja)

ధనుష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Dhanush (@dhanushkraja)

ధనుష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Dhanush (@dhanushkraja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.